విశాఖపట్నం ఐటీ రంగంలో మరో చారిత్రాత్మక పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ (Cognizant) నగరంలో తమ కొత్త క్యాంపస్ను నిర్మించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నూతన అడుగు ద్వారా విశాఖపట్నం (Visakhapatnam) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ (IT) అభివృద్ధిలో కీలకమైన మైలురాయిని చేరనుంది.

కాపులుప్పాడలో 22 ఎకరాల విస్తీర్ణంలో మోడరన్ క్యాంపస్
కాగ్నిజెంట్ సంస్థ తమ విస్తరణ వ్యూహంలో భాగంగా విశాఖపట్నంలోని కాపులుప్పాడ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంది. ఇక్కడ సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో కూడిన ఐటీ క్యాంపస్ను నిర్మించనున్నట్లు కంపెనీ తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించింది.
ఉద్యోగావకాశాలకు విస్తృత మార్గం
ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత దాదాపు ఈ నూతన క్యాంపస్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాల విభాగాల్లో ప్రధానంగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు కాగ్నిజెంట్ తెలిపింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే దాదాపు 8,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.
2026లో కార్యకలాపాలు ప్రారంభం
కాగ్నిజెంట్ సంస్థ ప్రకారం, 2026 సంవత్సరం నుంచి ఈ నూతన క్యాంపస్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సంస్థ పేర్కొంది.
ప్రభుత్వ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు
ఈ కీలక నిర్ణయానికి పునాదిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారం నిలిచింది. ఆంధ్రప్రదేశ్లో తమ విస్తరణకు అవసరమైన సహకారం అందించిన సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్లకు కాగ్నిజెంట్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసింది.
ఈ పరిణామం విశాఖపట్నం ఐటీ అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
Read also: Atreyapuram: ఒక విద్యార్థికి.. ఇద్దరు ఉపాధ్యాయులు