ప్రతి సంవత్సరం కృష్ణా, గోదావరి వంటి ప్రధాన నదుల నుంచి వేల టీఎంసీల నీరు వినియోగం లేకుండా సముద్రంలో కలిసిపోతుండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి దేశానికి పెద్ద నష్టమని పేర్కొంటూ, నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
Read Also: TDP Joining: వైసీపీకీ భారీ షాక్ ఇచ్చిన అనంతపురం మైనార్టీలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలోనే అనేక కీలక జల ప్రాజెక్టులకు తాము శ్రీకారం చుట్టినట్లు గుర్తు చేసిన సీఎం, అప్పట్లోనే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో(CM Chandrababu) పెట్టుకుని ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఇప్పటికీ నీరు వృథా కాకుండా వినియోగించేందుకు ఎవరైనా ముందుకు వస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నీటి కొరత సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం కావాలంటే నదుల అనుసంధానం అత్యవసరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. గంగా–కావేరీ, గోదావరి–పెన్నా వంటి నదులను కలపడం ద్వారా నీటి వనరులను సమతుల్యంగా పంచుకోవచ్చని సూచించారు. ఈ విధానం అమలైతే సాగునీటి అవసరాలు తీరడమే కాకుండా, తాగునీటి సమస్య కూడా గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. నదుల అనుసంధాన ప్రాజెక్టులు భవిష్యత్ తరాలకు నీటి భద్రతను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని, ఇది దేశ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: