CM Chandrababu: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, దీనికి అనుగుణంగా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని చంద్ర బాబు స్పష్టం చేశారు. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎఫ్బీఎంఎస్)పై ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోని తన చాంబర్లో సమీక్ష జరిపారు.
Read Also: Kakinada Firecracker Blast: ఆగని మరణ మృదంగం.. మృతుల సంఖ్య 25కు పెంపు!

26 రకాల వివరాలతో ఫ్యామిలీ ఐడీ
ఫ్యామిలీ ఐడీ, ఆధార్ నెంబర్, రైస్ కార్డ్ ఐడీ, విద్యార్హతలు, వృత్తి, మొబైల్ నెంబర్, చిరునామా, వ్యవసాయ భూమి, అర్బన్ రూరల్ ప్రాపర్టీ వంటి మొత్తం 26 ఆట్రి బ్యూట్స్తో ఫ్యామిలీ వివరాలు ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎసీఎస్ఈబ్ల్యు, డిస్కమ్స్, ఎంఏయూడీ, వాహన్, హెన్ఆర్ఎంఎస్, సీబీడిటీల, పంచాయతీరాజ్, మార్క్ ఫెడ్ వంటి శాఖల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇందులో పొందుపరచాలని సూచించారు. ఇప్పటికే 82 శాతం సమాచారం ఉందని, వచ్చే ఏప్రిల్ 30 నాటికి 90 శాతం డేటాబేస్ సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. అయితే ప్రభుత్వంలోని అన్ని శాఖల దగ్గర ఉన్న డేటాబేస్ సమీకృతం చేయాలని, అప్పుడు కచ్చితత్వం పెరుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: