చిత్తూరు(Chittoor news) జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు , సిబ్బందితో సమన్వయంగా విస్తృత స్థాయిలో సోమవారం వేకువ జామున కార్డన్ సెర్చ్ ఆపరేషన్(Cordon search operation) నిర్వహించారు. ఇక్కడ అనుమానాస్పద వ్యక్తులపై తనిఖీలు, వాహనాల పరిశీలన, నేరస్థుల కదలికలపై పర్యవేక్షణ, అక్రమ రవాణా నిరోధక చర్యలు చేపట్టారు.ప్రజల భద్రత, రక్షణను లక్ష్యంగా తీసుకొని, నేరాలు, అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా విస్తృతమైన కార్డన్ సెర్చ్ నిర్వహణ.
Read also: Chandrababu Naidu: నల్లమల సాగర్తో ఎవరికీ నష్టం లేదు: సీఎం

కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో 15 ద్విచక్ర వాహనాలు , 3 ఆటోలను సీజ్ చేయడం జరిగింది.
ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశ్యం నేరాలను ముందస్తుగా అరికట్టి, ప్రజల్లో భద్రతా వాతావరణాన్ని బలపరచడం. ప్రతి ప్రాంతంలో పోలీసుల సాన్నిధ్యం స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకోవడం ద్వారా, అసాంఘిక కార్యకలాపాలను నిరోధించడమే ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య లక్ష్యం అని అధికారులు పేర్కొన్నారు.
ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు లేదా వాహనాలను గమనిస్తే, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచబడతాయని భరోసా ఇచ్చారు. అదేవిధంగా, ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే పోలీసుల సహాయాన్ని పొందవచ్చని సూచించారు.
హెల్మెట్ అవేర్నెస్ , రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమాలు కూడా నిర్వహించబడినవి. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని పోలీసులు ప్రజలకు సూచించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాలకు ప్రమాదంగా మారుతుందని తెలియజేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: