हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Chandrababu: అమరావతిలో బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రానికి సాయం చేయండి: చంద్రబాబు

Sharanya
Chandrababu: అమరావతిలో బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రానికి సాయం చేయండి: చంద్రబాబు

కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయను కోరిన సిఎం చంద్రబాబు

విజయవాడ: అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) విజప్తి చేశారు. ఢిల్లీలో రెండో రోజు పర్యటిస్తున్న సిఎం కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధి (sports development) కోసం చేపట్టాల్సిన ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. అమరావతిలో జాతీయ జల క్రీడల శిక్షణా హబ్ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

స్పోర్ట్స్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు కు నిధులు మంజూరు

కృష్ణానదీ తీరంలో వాటర్ స్పోర్ట్స్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు విస్తృత అవకాశాలున్నాయని భేటీలో సిఎం వివరించారు. క్రీడలకు సంబంధించి వివిధ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టులపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రతిపాదనల్ని మంత్రిత్వశాఖకు పంపినట్టు సిఎం కేంద్రమంత్రికి తెలిపారు. నాగార్జునా యూనివర్సిటీ, కాకినాడలలో నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లా ఏర్పాటుకు ప్రతిపాదించినట్టు వెల్లడించారు. తిరుపతి, రాజమహేంద్రవరం, కాకినాడ, నరసరావుపేటలలో ఖేలో ఇండియా (Khelo India) కింద మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులను పూర్తి చేయాలని పేర్కొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధికి రూ.27 కోట్లు, గుంటూరు బిఆర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు రూ.170 కోట్లు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్రీడలా అభివృద్ధికి రూ.341 కోట్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కోరారు. జిల్లాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు అదనంగా ఖేలో ఇండియా కేంద్రాలు మంజూరు. చేయాలని అన్నారు. రాయలసీమలోని తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణా కేంద్రం. ఏర్పాటును పరిశీలించాలని ముఖ్యమంత్రి కోరారు.

2024-29 స్పోర్ట్స్ పాలసీలో భాగంగా ఏపీలో స్పోర్ట్స్ ఎకో సిస్టం అభివృద్ధికి చర్యలు చేపట్టినట్టు సీఎం వెల్లడించారు. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ 2025 ను ఏపీలో నిర్వహించేందుకు అవకాశం ఇవ్వడంపై కేంద్ర మంత్రి మాండవీయకు. ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియచేశారు. విజయవాడ, విశాఖ తదితర నగరాల్లో అత్యుత్తమ క్రీడా వేదికలపై వీటిని నిర్వహిస్తామని సిఎం స్పష్టం చేశారు. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ నిర్వహణకు రూ.25 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ కార్యక్రమాల్లో ఏపీకి చెందిన కేంద్రమంత్రులు కింజరపు రామ్మోహననాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టిడిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు .

చంద్రబాబు బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు?


చంద్రబాబు అమరావతిలో, రాష్ట్ర రాజధాని ప్రాంతంలో, బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీనికోసం కేంద్ర ఆరోగ్య మంత్రిగా ఉన్న మన్స్‌ఖ్ మాండవీయను కలిసి అమరావతిలో బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రానికి సహాయం అందించాలని కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Visakha police : 22 మంది నిందితులను అరెస్టు చేసిన విశాఖ పోలీసులు ఎందుకంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు

బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ
0:26

ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ

హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

📢 For Advertisement Booking: 98481 12870