ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల జాతినుద్దేశించి చేసిన ప్రసంగం దేశ రాజకీయ వర్గాల్లో, మిలిటరీ వర్గాల్లో, అలాగే సామాన్య ప్రజల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. “ఆపరేషన్ సిందూర్” విజయాన్ని పునరుద్ఘాటిస్తూ, దేశ రక్షణ విషయంలో భారత్ ధైర్యంగా, స్పందించగలదని ప్రపంచానికి మోదీ చాటిచెప్పారు. మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగం భారతదేశపు నూతన సిద్ధాంతాన్ని ఆవిష్కరించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు.

చంద్రబాబు నాయుడు స్పందన
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు ఇది ఒక గట్టి హెచ్చరిక అని, ప్రపంచానికి భారతదేశ బలాన్ని స్పష్టం చేసిందని అన్నారు. ప్రధాని కేవలం ప్రసంగించడమే కాకుండా దేశానికి ఒక నూతన మార్గనిర్దేశం చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. బుద్ధ పూర్ణిమ నాడు శాంతి మార్గాన్ని స్మరించుకుంటామని, అయితే చరిత్ర బోధించినట్లుగా బలంతోనే శాశ్వత శాంతి సాధ్యమవుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మనం శాంతి మార్గంలో పయనిస్తాం, కానీ ఉగ్రవాదం పట్ల మాత్రం జీరో టాలరెన్స్ అనేది భారతదేశ అధికారిక ధోరణిగా నిలుస్తోంది. అని స్పష్టం చేశారు.
ఆపరేషన్ సిందూర్ – మేడిన్ ఇండియా సత్తా
భారత్ స్వదేశీ సాంకేతికతతో ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయగలిగిందని గర్వంతో చెప్పిన అంశం. ‘ఆపరేషన్ సిందూర్’ గురించి ప్రస్తావిస్తూ, దేశీయంగా అభివృద్ధి చేసిన డ్రోన్లు, ఆయుధాలను విజయవంతంగా ఉపయోగించి సరిహద్దు ఆవలి ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశామని అన్నారు. ఈ ‘మేడిన్ ఇండియా’ రక్షణ సాంకేతిక పరిజ్ఞానం, మన దేశాన్ని కాపాడుకోవడానికి ఆధునిక యుద్ధానికి మన సంసిద్ధతను చాటిందని, ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసిందని తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ బలగాలు అత్యంత వేగంగా, కచ్చితత్వంతో స్పందించిన తీరును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. భారతీయులుగా మనం ఏకతా, శాంతి, దేశభక్తి వంటి విలువలపట్ల కట్టుబడి ఉండాలని, దేశ ప్రయోజనాలను ఎల్లప్పుడూ ముందు ఉంచాలన్న పిలుపు. భారతీయులుగా మనం ఐక్యంగా ఉంటూ, ఎల్లప్పుడూ దేశానికే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
పవన్ కల్యాణ్ స్పందన
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా ఈ విషయంపై స్పందించారు. ‘ఆపరేషన్ సిందూర్’ విషయంలో ప్రధాని మోదీ యావత్ భారతానికి, అంతర్జాతీయ సమాజానికి అత్యంత శక్తివంతమైన సందేశం ఇచ్చారని ఆయన కొనియాడారు. ఉగ్రవాదం-చర్చలు కలిసి సాగవు, ఉగ్రవాదం-వాణిజ్యం కలిసి సాగవు, రక్తం-నీరు కలిసి ప్రవహించవు అన్న ప్రధాని వ్యాఖ్యలను పవన్ తన ప్రకటనలో ఉటంకించారు. పవన్ వ్యాఖ్యల్లో ఉగ్రవాదంపై భారత్ తన స్థానం స్పష్టంగా వెల్లడించిందని, భవిష్యత్లో ఇలాంటి దాడులకు తగిన శిక్ష తప్పదని ఉగ్రవాదులకు స్పష్టమైన సందేశం పంపినట్లు స్పష్టమవుతుంది.
Read also: Chandrababu: ఎస్టీ రిజర్వేషన్లపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం