Bill Gates: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అమరావతికి చేరుకున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రులను పరిచయం చేస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్తో గేట్స్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
Read Also: Chandrababu-Bill gates: ఏపీలో డిజిటల్ హెల్త్ విప్లవం

అనంతరం బిల్ గేట్స్ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) కేంద్రాన్ని సందర్శించారు. రాష్ట్ర పరిపాలనలో సాంకేతిక పరిజ్ఞానం ఎలా ఉపయోగించబడుతోందో ఆయన సమీక్షించారు. డిజిటల్ గవర్నెన్స్, ప్రజలకు సేవల పంపిణీ, డేటా ఆధారిత నిర్ణయాలపై ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను సీఎం చంద్రబాబు ఆయనకు వివరించారు.
తదుపరి కాన్ఫరెన్స్ హాల్లో మంత్రులు, ఉన్నతాధికారులతో గేట్స్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆరోగ్యం, విద్య, డిజిటల్ పాలన, గ్రామీణ అభివృద్ధి వంటి రంగాల్లో గేట్స్ ఫౌండేషన్తో భాగస్వామ్య అవకాశాలపై చర్చలు జరగనున్నట్లు సమాచారం. అమరావతిలో జరుగుతున్న ఈ భేటీ ద్వారా రాష్ట్రంలో టెక్నాలజీ ఆధారిత పరిపాలనను మరింత బలోపేతం చేయడమే కాకుండా, ప్రజలకు సేవలను వేగంగా అందించేందుకు కొత్త ప్రాజెక్టులు రూపుదిద్దుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: