हिन्दी | Epaper

ఉప ఎన్నికలకు సిద్ధమా? – కూటమి సర్కార్ కు అవినాష్ సవాల్

Sudheer
ఉప ఎన్నికలకు సిద్ధమా? – కూటమి సర్కార్ కు అవినాష్ సవాల్

జగన్‌పై అనర్హత వేటు పడుతుందని, పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందని కూటమి నేతలు వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి స్పందిస్తూ, సూపర్ సిక్స్ రెఫరెండంతో కుప్పం, పిఠాపురం, మంగళగిరి నియోజకవర్గాల్లో ఎన్నికలకు మీరు సిద్ధమా? అని కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. సూపర్ సిక్స్ పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని, దీనివల్ల ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని తెలిపారు. కడపలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో టెస్లా తన ప్లాంట్ ఏర్పాటు

వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు

అసెంబ్లీలో వైసీపీ సభ్యులు సంధించే ప్రశ్నలకు భయపడే ప్రభుత్వం వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని అవినాశ్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల్లో వైసీపీ మాత్రమే నిజమైన ప్రతిపక్షమని, 11 సీట్లు ముఖ్యం కాదని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఉన్న నాలుగు పార్టీల్లో మూడు ప్రభుత్వంలో భాగమైనందున, మిగిలిన ఏకైక పార్టీ అయిన వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా మోసం చేస్తోందని మండిపడ్డారు.

పాలనలో వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రజల విశ్వాసం ప్రభుత్వంపై తగ్గిపోతోందని, పాలనలో వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించేందుకు వైసీపీ నిరంతరం ప్రయత్నిస్తుందని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను గౌరవించి, పారదర్శక పాలన అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మైనర్ బాలిక అత్యాచారం కేసు.. నిందుతునికి 20 యేళ్లు జైలు

మైనర్ బాలిక అత్యాచారం కేసు.. నిందుతునికి 20 యేళ్లు జైలు

లారీ, ద్విచక్ర వాహనం ఢీ, ఇద్దరు యువకులు మృతి

లారీ, ద్విచక్ర వాహనం ఢీ, ఇద్దరు యువకులు మృతి

ఎసిబి వలలో టౌన్ ప్లానింగ్ సర్వేయర్

ఎసిబి వలలో టౌన్ ప్లానింగ్ సర్వేయర్

మునిసిపాలిటీల్లో నేటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన

మునిసిపాలిటీల్లో నేటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన

మొయినాబాద్ కేసుపై చంద్రబాబు సీరియస్; ఎంపీ పుట్టా మహేష్‌కు షాక్!

మొయినాబాద్ కేసుపై చంద్రబాబు సీరియస్; ఎంపీ పుట్టా మహేష్‌కు షాక్!

బీజేపీతో జగన్ అక్రమ పొత్తు – షర్మిల

బీజేపీతో జగన్ అక్రమ పొత్తు – షర్మిల

ఎన్‌సీఎల్‌ఏటీలో విజయమ్మ కీలక వాదనలు

ఎన్‌సీఎల్‌ఏటీలో విజయమ్మ కీలక వాదనలు

ఏపీలో 150 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల

ఏపీలో 150 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల

తిరుమలకు యుద్ధ సెగ: గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లు బంద్

తిరుమలకు యుద్ధ సెగ: గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లు బంద్

సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే

సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే

ఏపీలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు

ఏపీలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు

అంధ క్రికెటర్ దీపికకు అండగా నిలిచిన ఎమ్మెల్యే

అంధ క్రికెటర్ దీపికకు అండగా నిలిచిన ఎమ్మెల్యే

📢 For Advertisement Booking: 98481 12870