విజయవాడ : సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఏపీఎస్ సీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రద్దీ దృష్ట్యా రోజూ నడిచే రెగ్యులర్ సర్వీసులకు అదనంగా 8 వేల 432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఎపీఎస్ ఆర్టీసీ (APSRTC) ప్రకటించింది. ఈసారి స్త్రీశక్తి పథకం దృష్ట్యా రాష్ట్రంలో పలు ప్రాంతాల మధ్య ప్రత్యేక బస్సుల ఏర్పాటులో ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది. 71 శాతం బస్సులను రాష్ట్రంలోని పలు ప్రాంతాల మధ్య ప్రత్యేక సర్వీసులుగా నడపాలని నిర్ణయించింది. గ్రామాలు, మండలాలు, పట్టణాల మధ్య రద్దీ గణనీయంగా పెరిగిన దృష్ట్యా వీటి మధ్య 6 వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది.
Read also: Roja : చిల్లర మాటలు మానుకో.. రోజాకు నుడా చైర్మన్ కోటంరెడ్డి కౌంటర్

RTC special buses for Sankranthi
కడప జిల్లా నుంచి ప్రత్యేక బస్సులు
ఇతర రాష్ట్రాల్లోని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు 2 వేల 432 ప్రత్యేక బస్సులుగా నడిపేందుకు కేటాయించింది. పండగ ముందు రోజుల్లో మొత్తం 3857 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. వీటిలో హైదరాబాద్ కు 240, 102, 3 15 బస్సులు ఏర్పాటు చేయగా, రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు 3500 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. పండుగ తిరుగు ప్రయాణానికి మొత్తం 4 వేల 575 బస్సులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కు 1800, బెంగళూరు 200, చెన్నై 75 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయగా వీటిలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల మధ్య నడిపేందుకు 2500 బస్సులు ఏర్పాటు చేశారు.
ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ బస్సుల్లోని చార్జీనే. వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. దూర ప్రాంతాలకు నడిచే ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించినట్లు ఆర్టీసీ తెలిపింది. కడప నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసారు. సంక్రాంతికి కడవ జిల్లా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి 40, బెంగుళూరు నుంచి 40 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి 30, చెన్నై నుంచి 10 ప్రత్యేక బస్సులు కేటాయించారు. ఈ నెల 9 నుంచి 13 వరకు నడవనున్న బస్సుల్లో సాధారణ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: