हिन्दी | Epaper
హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

APSCHE: తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నత విద్యా సహకారం అవసరం

Tejaswini Y
APSCHE: తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నత విద్యా సహకారం అవసరం

APSCHE: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నత విద్యలో ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్లు అభిప్రాయ పడ్డారు. రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాల మధ్య ఉన్నత విద్యలో ప్రాంతీయ సహకారం ఉండాలన్నారు. గురువారం తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి(Professor V. Balakishta Reddy), ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కె మధుమూర్తితో మంగళగిరిలోని ఏపీ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో సమావేశమయ్యారు.

Read Also: SIT Notice : సిట్ విచారణను కార్తీకదీపం సీరియల్ తో పోల్చిన కేటీఆర్

APSCHE: Higher education cooperation among Telugu states is needed
APSCHE: Higher education cooperation among Telugu states is needed

రెండు రాష్ట్రాలలో విద్యార్థుల అభివృద్ధి

ఈ సమావేశంలో ఏపి ఉన్నత విద్యా మండలి వైస్ఛర్మన్లు ప్రొఫెసర్ ఎస్ విజయభాస్కర్ రావు, ప్రొఫెసర్ కె రత్నశీల మణి, కార్యదర్శి ప్రొఫెసర్ బి తిరుపతి రావు పాల్గొన్నారు. ఉన్నత విద్యా రంగంలో కొనసాగుతున్న కార్యక్రమాలకు సంబంధించిన కీలక అంశాలపై సమావేశంలో చర్చించారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. విద్యా నైపుణ్యాన్ని పెంచడంతో పాటు పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్నారు. సంస్థాగత భాగస్వామ్యాలను పెంపొందించడంతోపాటు రెండు రాష్ట్రాలలో విద్యార్థుల అభివృద్ధి కార్యక్రమాలను మెరుగు పరచడంపై చర్చించారు.

క్వాంటం టెక్నాలజీలు, ఆన్‌లైన్ కోర్సుల విస్తరణ

చర్చల సందర్భంగా ఏపి ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. మధు మూర్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపి ఉన్నత విద్యా మండలి చేపడుతున్న వివిధ విద్యా కార్యక్రమాల గురించి తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్ట రెడ్డికి వివరించారు. క్వాంటం టెక్నాలజీస్లో చొరవలు, బోధన అభ్యాస ప్రక్రియల నాణ్యతను మెరుగుపరచడం, విద్యార్థులు, అధ్యాపకులకు అధికనాణ్యత ఆన్లైన్ కోర్సులకు ప్రాప్యతను విస్తరించడం లక్ష్యంగా ఏపి ఉన్నత విద్యా మండలి చేపడుతున్న కార్యక్రమాల విసృత అమలు కార్యక్రమాల గురించి వివరించారు.

ప్రపంచ విద్యా, పరిశ్రమ అవసరాలను తీర్చడానికి రెండు రాష్ట్రాలలోని విద్యార్థులను సిద్ధం చేస్తూ, అభివృద్ధి చెందుతున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలలో నైపుణ్యాలతో సన్నద్ధం చేయవలసిన అవసరాన్ని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్ట రెడ్డి నొక్కి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నత విద్య నాణ్యతను పెంచడానికి రెండు కౌన్సిల్లు నైపుణ్యం, ఉత్తమ పద్ధతులు, వనరులను చురుకుగా పంచుకోవాలని సూచించారు. విద్యా విధా నాల-అభివృద్ధి, సంస్థలు, అధ్యాపకులు, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడే ఉమ్మడి చొరవలను అన్వేషించడం, తద్వారా రెండు రాష్ట్రాలలో ఉన్నత విద్యారంగాన్ని మెరుగు పరచడమే లక్ష్యంగా ముందుకుసాగాలని నిర్ణయించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870