ఆంధ్రప్రదేశ్లోని కొత్త ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) ఆరోపించారు. ముఖ్యంగా ఈసెట్ అడ్మిషన్ల (ECET Admissions) ప్రక్రియలో తీవ్రమైన ఆలస్యం వల్ల ప్రభుత్వ అసమర్థత బట్టబయలవుతోందని విమర్శించారు. ఫలితాలు విడుదలై నెలన్నర అవుతున్నా కౌన్సెలింగ్ మొదలవ్వకపోవడం దారుణమన్నారు.ఈసెట్ ఫలితాలు మే 15న వెలువడినప్పటికీ, ఇప్పటికీ అడ్మిషన్ల షెడ్యూల్ ప్రకటించకపోవడం గమ్యకాబోదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్న తరుణంలో వేలాది మంది విద్యార్థులు అసమాధానంలో ఉన్నారని చెప్పారు. ఇది రాష్ట్ర విద్యా వ్యవస్థ ఎలా ఆందోళనకర స్థితిలో ఉందో స్పష్టంగా చూపుతున్నదని తెలిపారు.(YS Jagan)
అమాత్యా మేలుకో… పప్పూ నిద్రవదులు!
విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్ల పట్టనట్టుగా వ్యవహరించడాన్ని జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. అమాత్యా మేలుకో… పప్పూ నిద్ర వదులు అంటూ రాజకీయంగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విద్య అనాధలా మారిందని విమర్శించారు.
31,922 మంది విద్యార్థుల ఆశలు అర్థాంతరంగా
ఈ ఏడాది ఇంజినీరింగ్ రెండో సంవత్సరం ప్రవేశాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 34 వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్కు హాజరైందని, అందులో 31,922 మంది అర్హత సాధించారని జగన్ గుర్తు చేశారు. అంతటి మందికి ఉన్న భవిష్యత్ ఆశలను ప్రభుత్వం నిర్లక్ష్యంతో గాలికొదిలిందని మండిపడ్డారు.
తక్షణమే షెడ్యూల్ విడుదల చేయాలి
ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుని ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను విడుదల చేయాలని, అడ్మిషన్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని జగన్ డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును గౌరవించాలని, రాజకీయ ప్రయోజనాల కోసం వారి జీవితాలతో ఆడుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Read Also : Bangladesh : బంగ్లాదేశ్ లో హిందూ మహిళపై అత్యాచారం : ఐదుగురి అరెస్ట్