हिन्दी | Epaper

AP: అంతర్రాష్ట్ర బదలీలకు ఎపి ప్రభుత్వం సానుకూలం

Saritha
AP: అంతర్రాష్ట్ర బదలీలకు ఎపి ప్రభుత్వం సానుకూలం

కోరుతున్న పాఠశాల విద్యా శాఖ

విజయవాడ : అంతర్రాష్ట్ర బదిలీల్లో భాగంగా గతంలో తెలంగాణ రాష్ట్రానికి వెళ్లేందుకు సమ్మతి ఇచ్చిన ఉద్యోగుల నుంచి ఏపీ (AP) పాఠశాల విద్యా శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. విద్యా శాఖలో పని చేస్తున్న 229మంది అంతర్రాష్ట్ర బదిలీలకు ఐచ్ఛికాలు ఇచ్చారు. వీరిలో సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, ఎంఈవోలు, సహాయ సంచాలకులు ఉన్నారు. స్పౌజ్, వ్యక్తిగత, మెడికల్, లోకల్ కేటగిరీల కింద బది లీల్లో వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

Read Also: AP: ఆదివాసీల దశాబ్దాల కలను సాకారం చేసిన చంద్రబాబు

AP: అంతర్రాష్ట్ర బదలీలకు ఎపి ప్రభుత్వం సానుకూలం

టిజి రాష్ట్రానికి వెళ్లే వివరాలు

ఈ ప్రక్రియలో కొంత జాప్యం జరిగినందున కొంతమంది (AP) ఉద్యోగులు పదవీ విరమణ చేయడం, పదోన్నతి పొందడం, తెలంగాణకు (TG) వెళ్లేందుకు ఇష్టపడకపోవడంలాంటి కారణాలు ఉన్నందున మొదటి జాబితాను నవీకరించేందుకు పాఠశాల విద్యాశాఖ వివరాలు సేకరిస్తోంది. వివరాలను తక్షణమే పంపించాలని సూచించింది. ప్రత్యేక ఫార్మెట్లు ఇచ్చింది. వివరాల సేకరణ అనంతరం తుది జాబితాను రెండు, మూడు రోజుల్లో తెలంగాణకు రాష్ట్ర ప్రభుత్వం పంపించనుంది. ఇప్పుడు కొత్తగా ఎవ్వరినీ అనుమతించరాదని జిల్లా స్థాయి అధికారులకు సూచించింది. కొత్త వారికి సైతం అవకాశం కల్పించాలని ఏపీ టీఎఫ్ అమరావతి అధ్యక్షుడు సీవీ ప్రసాద్ కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870