ఏపీలోని రెండు కోఆపరేటివ్ బ్యాంకులు రుణాల మంజూరు విధానంలో లోపాలు, కేవైసీ నిబంధనలు సరిగా పాటించకపోవడం, అలాగే బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టంలోని పలు సెక్షన్లను ఉల్లంఘించినట్లు ఆర్బీఐ గుర్తించింది. ఈ నేపథ్యంలో కాకినాడ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్కి రూ.1 లక్ష, కర్నూలు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్కి రూ.1.50 లక్షల జరిమానా విధించింది. ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటకలోని మరో రెండు బ్యాంకులకు కూడా ఇలాంటి నిబంధనల ఉల్లంఘనల కారణంగా ఆర్బీఐ పెనాల్టీలు ప్రకటించింది.
Read also: Guntur Crime: ప్రేమ వివాహం చేసుకున్నాడని యువకుడి కుటుంబ సభ్యులపై దాడి

RBI shocks those 2 banks!
పెనాల్టీల వల్ల ఎలాంటి ప్రభావం ఉండదని
ఈ జరిమానాలు పూర్తిగా బ్యాంకులు పాటించాల్సిన రెగ్యులేటరీ నిబంధనలకు సంబంధించినవేనని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఖాతాదారుల డిపాజిట్లు, విత్డ్రాయల్స్ లేదా ఇతర బ్యాంకింగ్ సర్వీసులపై ఈ పెనాల్టీల వల్ల ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది. సాధారణ లావాదేవీలు యథావిధిగా కొనసాగుతాయని, ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్బీఐ భరోసా ఇచ్చింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: