ఆంధ్రప్రదేశ్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు శుభవార్త. రాష్ట్ర సాంకేతిక విద్యా మరియు శిక్షణామండలి (SBTET) AP POLYCET 2026 అధికారిక నోటిఫికేషన్ను విడుదల చేసింది. పదో తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు.
Read also: Visakhapatnam Crime: విశాఖలో విద్యుదాఘాతంతో తండ్రీకొడుకుల మృతి

ముఖ్యమైన తేదీలు ఇవే:
- దరఖాస్తుల ప్రారంభం: మార్చి 3, 2026 నుంచి ఆన్లైన్ ప్రక్రియ మొదలవుతుంది.
- చివరి తేదీ: ఏప్రిల్ 4, 2026 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
- పరీక్ష తేదీ: ఏప్రిల్ 25, 2026న రాష్ట్రవ్యాప్తంగా పాలిసెట్ పరీక్ష నిర్వహించనున్నారు.
అర్హత మరియు దరఖాస్తు రుసుము:
పదో తరగతి (SSC) ఉత్తీర్ణులైన లేదా ప్రస్తుతం ఫైనల్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- OC మరియు BC అభ్యర్థులకు: రూ. 400
- SC మరియు ST అభ్యర్థులకు: రూ. 100 అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: