ఆంధ్రప్రదేశ్ (AP) లోని, పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం మండలం నీలకంఠపురం ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఫేర్వెల్ పార్టీ పేరుతో ట్రాన్స్జెండర్లతో అసభ్యకర నృత్యాలు చేయించిన ఘటనపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఐటీడీఏ అధికారులు వెంటనే స్పందించి, పాఠశాల డిప్యూటీ వార్డెన్ను సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై విచారణ కొనసాగుతోంది.
Read Also: Pawan Kalyan: ఇప్పటికే రూ.10 వేల కోట్ల పనులు ప్రారంభించాం

అనుచిత కార్యక్రమాలు జరగడం బాధాకరం
చిన్న వయసులో ఉన్న విద్యార్థుల ముందే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల వారి మానసిక వికాసంపై ప్రతికూల ప్రభావం చూపేలా చేశారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయుల సమక్షంలో ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళనకరమని అంటున్నారు. తమ పిల్లలను నమ్మకంతో పాఠశాలకు పంపితే, అక్కడ ఇలాంటి అనుచిత కార్యక్రమాలు జరగడం బాధాకరమని వాపోతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: