AP: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల అభివృద్ధిపై కీలక ప్రకటన చేశారు. శనివారం శ్రీకాళహస్తీశ్వర స్వామిని, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీకాళహస్తి క్షేత్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. తిరుపతి ఎయిర్పోర్టును పరిశీలించి ఆధ్యాత్మిక ప్రదేశాలకు విమాన సర్వీసులు కల్పిస్తామని తెలిపారు.
Read Also: AP Govt Advisor: ఏపీ ప్రభుత్వ సలహాదారుగా శ్రీధర్ నియామకం

టీటీడీలో ‘ఏఐ’ వినియోగం
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగంపై ఇప్పటికే ఒక నిపుణుల బృందం పని చేసిందని, ఆ టీమ్తో చర్చించి భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తామని వెల్లడించారు. తిరుమలలోని టీటీడీ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరు తమకు ఆదర్శమని మంత్రి తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: