AP: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు కీలక దశకు చేరింది. ముంబై వ్యాపారి అనిల్ చోఖ్రా ఈ స్కామ్లో ప్రధాన లింక్గా తేలడంతో, ఆయనను 49వ నిందితుడిగా చేర్చారు. సిట్ అధికారులు ముంబైకి వెళ్లి విచారణ జరిపి, డొల్ల కంపెనీల ద్వారా వందల కోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చిన ఆధారాలు సేకరించారు. విచారణలో అనిల్ చోఖ్రా మనీ లాండరింగ్ వ్యవహారంపై కొంతవరకు అంగీకరించినట్లు సమాచారం.
News Telugu: AP Govt: పని గంటలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన AP ప్రభుత్వం

AP Liquor Scam
అనిల్ చోఖ్రాకు మనీ లాండరింగ్ (Money laundering) కేసుల్లో పాత నేర చరిత్ర ఉంది. గతంలో ఈడీ అధికారులు కూడా ఆయనను రెండు సార్లు అరెస్టు చేశారు. ఇప్పుడు సిట్ దర్యాప్తులో ఆయన పేరు మరోసారి బయటకు రావడంతో కేసు మళ్లీ సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఈ కేసులో 48 మంది నిందితులు ఉండగా, సిట్ తాజా మెమో ద్వారా చోఖ్రాను కూడా చేర్చింది. త్వరలోనే ఆయన అరెస్టు జరిగే అవకాశం ఉందని సమాచారం.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: