ఆంధ్రప్రదేశ్ (AP) లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఆయనకు అక్కడ ఊరట లభించలేదు. ఈ కేసులో ప్రస్తుతం జోక్యం చేసుకునే పరిస్థితి లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంటూ రాజ్ కెసిరెడ్డికి షాక్ ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రూ.700 కోట్ల కుంభకోణంలో 9 నెలలు జైలులో ఉండటం ఎక్కువేమీ కాదని పేర్కొంది. కాగా, పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు సమయంలో ఇవ్వాలని రాజ్ కెసిరెడ్డి తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. దాంతో విచారణ గురువారానికి వాయిదా పడింది.
Read Also: Minister Atchannaidu: కోడి మాంసం, గుడ్లు తినొచ్చు.. బర్డ్ ఫ్లూపై స్పష్టత

Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: