ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారసత్వంగా వచ్చే వ్యవసాయేతర స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. గతంలో గ్రామాల్లో పూర్వీకుల నుండి వచ్చిన ఇళ్లు లేదా ఖాళీ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి సర్టిఫికేట్లు పొందాల్సి వచ్చేది. ఈ విధానం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడటమే కాకుండా, అవినీతికి కూడా ఆస్కారం ఉండేది. దీనిని గమనించిన ప్రభుత్వం, ఇకపై అటువంటి స్థలాల రిజిస్ట్రేషన్కు రెవెన్యూ శాఖ జారీ చేసే ప్రత్యేక సర్టిఫికేట్ అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సరళతరం కానుంది.
Read Also : UNSC Resolution : ఇరాన్ కు వ్యతిరేకంగా UNSC తీర్మానం
నూతన నిబంధనల ప్రకారం, ఆస్తి యజమానులు ఇచ్చే సెల్ఫ్ డిక్లరేషన్ (స్వయం ధృవీకరణ) పత్రం ఉంటే సరిపోతుంది. తమకు సదరు ఆస్తి పూర్వీకుల నుండి వారసత్వంగా లభించిందని, ఆ స్థలం ప్రభుత్వం నిషేధించిన 22A జాబితాలో లేదని, తామే ఆ ఆస్తికి పూర్తి హక్కుదారులమని యజమానులు ఆ పత్రంలో స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. అయితే, ఈ వెసులుబాటును అడ్డం పెట్టుకుని ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే లేదా ప్రభుత్వ భూములను తమవిగా చూపిస్తే, వారిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మార్పు వల్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పారదర్శకత పెరగడమే కాకుండా, భూ యజమానులకు అనవసరపు ఖర్చులు, కాలయాపన తప్పుతాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :