हिन्दी | Epaper
హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

AP Electricity Charges: విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదు: చంద్రబాబు

Siva Prasad
AP Electricity Charges: విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదు: చంద్రబాబు

AP Electricity Charges: విద్యుత్ ఛార్జీల పెంపుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఇకపై విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని ఆయన స్పష్టంగా తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనలో వచ్చే ఐదేళ్లపాటు విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని హామీ ఇచ్చారు.

Read Also: Akira Nandan: అకీరానందన్‌పై ఏఐ వీడియో.. నిందితుడి అరెస్ట్

శనివారం నగరిలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు, ప్రజలకు భారం పడకుండా పాలన కొనసాగించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. “చెడును గుర్తు పెట్టుకోండి, మంచిని ప్రోత్సహించండి. ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తే ప్రజల జీవితాల్లో పెద్ద మార్పులు తీసుకురావచ్చు” అని ఆయన పేర్కొన్నారు.

గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలపై భారీగా విద్యుత్ ఛార్జీల భారం మోపారని సీఎం విమర్శించారు. ఆ కాలంలో దాదాపు రూ.32 వేల కోట్ల వరకు విద్యుత్ ఛార్జీలు పెంచారని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు.

AP Electricity Charges
AP Electricity Charges: There will be no increase in electricity charges: Chandrababu

విద్యుత్ రంగంలో పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా గృహ వినియోగదారులు, పరిశ్రమలకు పెద్ద ఊరట లభించనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870