
ఆంధ్రప్రదేశ్ (AP) రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి అంబటి రాంబాబుసు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబును దూషించిన కేసులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోగా ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. మరోవైపు చంద్రబాబును దూషించడంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు అంబటి ఇంటిపై దాడి చేశారు. ఈ పరిణామాలపై అమెరికాలో ఉంటున్న ఆయన మూడో కూతురు అంబటి శ్రీజ స్పందిస్తూ ఓ వీడియోను షేర్ చేశారు.
Read Also: AP: సీబీఐ ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదనేది వాస్తవం: పవన్
వెంకటేశ్వరస్వామి అండతో రాళ్లు పువ్వులుగా మారుతాయి
ఆయన ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని అమెరికాలో ఉన్న ఆయన కుమార్తె అంబటి శ్రీజ ఆరోపించారు. తమ కుటుంబ సభ్యులపై దాడి చేశారని, కాపు అంటూ దూషించారని ఆమె తెలిపారు. ఈ దాడి వెనుక ఒక డాక్టర్, టీడీపీ కేంద్ర మంత్రి ఉన్నారని శ్రీజ ఆరోపించారు. మాజీ సీఎం జగన్ తమ నివాసానికి వచ్చి పరామర్శించారని, వెంకటేశ్వరస్వామి అండతో రాళ్లు పువ్వులుగా మారతాయని ఆమె పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: