हिन्दी | Epaper

News Telugu: AP: పత్తి, మొక్కజొన్న రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష

Rajitha
News Telugu: AP: పత్తి, మొక్కజొన్న రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష

సమకాలీన పరిస్థితుల్లో అరటి, పత్తి, (cotton) మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ధరలు పడిపోవడం, కొనుగోళ్లలో ఆలస్యం, మార్కెట్‌లో అనిశ్చితి వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. రైతులు ఎక్కడా నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Read also: Nandyal Road Accident : నంద్యాల జిల్లాలో ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం..ఇద్దరు మృతి

CM Chandrababu reviews issues of cotton and corn farmers

CM Chandrababu reviews issues of cotton and corn farmers

రాయలసీమ అరటికి రైల్వే వ్యాగన్ల సదుపాయం

రాయలసీమలో వేలాది హెక్టార్లలో పండుతున్న అరటికి ప్రస్తుతం సరైన ధర లభించకపోవడంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. డిసెంబరు ప్రారంభంలో ధరలు మెరుగుపడే అవకాశం ఉన్నందున అప్పటి వరకు రైతులు నష్టపోకుండా చూసేందుకు అరటిని ముంబై, కలకత్తా వంటి పెద్ద మార్కెట్లకు రైల్వే వ్యాగన్ల ద్వారా తరలించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఒక ప్రైవేటు ఏజెన్సీ ముందుకు వచ్చిందని అధికారులు చెప్పగా, రవాణా కార్యక్రమాన్ని సమగ్రంగా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. మార్కెట్ ధరలపై ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలని ఉద్యాన శాఖ, మార్కెటింగ్ శాఖలకు బాధ్యతలు అప్పగించారు.

మొక్కజొన్న మరియు పత్తి రైతులకు రక్షణ చర్యలు

మద్దతు ధరల కంటే తక్కువకు మొక్కజొన్న అమ్ముతున్న రైతులను ఆదుకునేందుకు ధరల స్థిరీకరణ నిధి నుంచి వ్యత్యాసాన్ని భర్తీ చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం నాయుడు చెప్పారు. ఈ సీజన్‌లో 8.18 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వచ్చే అవకాశం ఉండగా, అందులో 2.04 లక్షల మెట్రిక్ టన్నులను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని ఆదేశించారు. భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు రావొద్దని ఇతర ఏజెన్సీలతో ప్రయోగాత్మకంగా కొనుగోళ్లు చేపట్టే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పత్తి కొనుగోళ్లలో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు. భారీ వర్షాలు నమోదవుతుండటంతో సకాలంలో కొనుగోళ్లు జరగాలని ఆదేశించారు. ముఖ్యంగా తడిచిన లేదా రంగుమారిన పత్తిని కూడా కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870