हिन्दी | Epaper

విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు

sumalatha chinthakayala
విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు

అమరావతి: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. బుధవారం విజయవాడ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఏ కేసులో అన్నదానిపై స్పష్టత లేదు కానీ.. కాకినాడ పోర్టు కేసులో కావొచ్చని భావిస్తున్నారు. కాకినాడ పోర్టును బలవంతంగా రాయించుకున్నారన్న ఆరోపణలపై ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఈడీ కూడా విచారణకు పిలించింది కానీ సీఐడీ ఇంకా పిలువలేదు. ఆ కేసులో ఇప్పుడు విచారణకు పిలిచినట్లుగా భావిస్తున్నారు. నోటిసుల్లో 506, 384, 420, 109,467, 120(b) రెడ్ విత్ 34 BNS సెక్షన్లును పేర్కొన్నారు. ఇవి కఠినమైన సెక్షన్లుగానే భావిస్తున్నారు.

విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు

ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ

కాకినాడ సీపోర్టును బెదిరించి అన్యాయంగా వాటాలను రాయించుకున్నారని ఆ పోర్టు యజమాని కేవీ రావు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్‌ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, అరబిందో ఫార్మాకు చెందిన శరత్‌ చంద్రారెడ్డి, చెన్నైకు చెందిన ఆడిటింగ్‌ కంపెనీ పీకేఎఫ్‌ ప్రతినిధులు సుందర్‌, విశ్వనాథ్‌, ప్రసన్నకుమార్‌, అపర్ణలను నిందితులుగా చేర్చారు. సెజ్‌ను తమ పేరుతో రాయించుకున్న అరబిందో ఇన్‌ఫ్రాను కేసులో చేర్చారు. వాటాలు రాసివ్వకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని కేవీ రావును బెదిరించి, భయపెట్టి అత్యధిక షేర్లను అరబిందో సంస్థ సొంతం చేసుకున్నారని కేవీ రావు ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి ఈకేసులో విదేశాలకు పారిపోకుండా ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

వచ్చే జూన్ లేదా జూలైలో బీజేపీలోకి

ఈ కేసులో ఇప్పటికే ఈడీ కూడా విజయసాయిరెడ్డిని ప్రశ్నించింది. ఆ తర్వాత ఆయ న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైసీపీకి కూడా రాజీనామా చేశారు. తాను పొలం పనులు చేసుకుంటానని ప్రకటించారు. అయితే ఆయన వచ్చే జూన్ లేదా జూలైలో బీజేపీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెబుతున్నారు. రాజకీయాల నుంచి విరమించుకున్నా ఆయనపై కేసులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ పోర్టు వ్యవహారంలో ప్రభుత్వ అధికారాన్ని ఘోరంగా దుర్వినియోగం చేసి ఆస్తులు కాజేశారన్న ఆరోపణలను సీఐడీ చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

📢 For Advertisement Booking: 98481 12870