हिन्दी | Epaper

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

sumalatha chinthakayala
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

వైసీపీ సభ్యుల నిరసనల మధ్యే గవర్నర్ ప్రసంగం

అమరావతి : ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు, కూటమి పార్టీ సభ్యులు సభకు హాజరయ్యారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ సభ్యులు నేటి సమావేశానికి హాజరయ్యారు. ఉభయ సభలను ఉద్దేశించి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం మొదలుపెట్టారు. వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ గట్టిగా నినాదాలు చేశారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

శాసనసభ రేపటికి వాయిదా

బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఉదయం 9.45కు సీఎం చంద్రబాబు అసెంబ్లీకి వచ్చారు. అనంతరం 9.55 కి గవర్నర్ అబ్దుల్ నజీర్ కు గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించారు. అనంతరం సీఎం చంద్రబాబు గవర్నర్ కు స్వాగతం పలకనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు, సీఎం చంద్రబాబుకు అసెంబ్లీ వద్ద స్పీకర్, మండలి ఛైర్మన్, సీఎస్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ప్రారంభించగానే… ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినదించారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ సభలో పట్టుపట్టారు. గవర్నర్ ప్రసంగం అనంతరం 11.15 కు శాసనసభ రేపటికి వాయిదా పడనుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870