हिन्दी | Epaper

AP: పోక్సో కేసు నిందితుడికి 20 యేళ్ల జైలు, జరిమానా.. బాధితురాలికి రూ. 5 లక్షలు

Rajitha
AP: పోక్సో కేసు నిందితుడికి 20 యేళ్ల జైలు, జరిమానా.. బాధితురాలికి రూ. 5 లక్షలు

విజయనగరం : విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్లో 2024లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు పాండ్రంకి సురేష్(23)కి 20 సంవ త్సరాల కఠిన కారాగారశిక్ష విధిస్తూ పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి తీర్పు వెల్లడించారు. అలాగే నిధితుడికి రూ.2,500 జరిమానా, బాధితురాలికి పరిహారంగా రూ.5 లక్షలు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా, పూసపాటిరేగ మండలం, పేరాపురం గ్రామంకు చెందిన పాండ్రంకి సురేష్ అదే గ్రామానికి చెందిన ఒక బాలికను ప్రేమ పేరుతో శారీరకంగా అనుభవించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసాడన్నారు. ఆ బాలిక ఇచ్చిన ఫిర్యాదుపై పూసపాటిరేగ పోలీసు స్టేషను ఎఎస్ఐ 17.10.2024న పోక్సో కేసు నమోదు చేశారన్నారు.

Read also: Chandrababu Davos : అగాథంలో ఉన్న ఏపీని అగ్రస్థానానికి తెచ్చాం – సీఎం చంద్రబాబు

AP

Accused in POCSO case sentenced to 20 years in jail

అనంతరం అప్పటి విజయనగరం డిఎస్పీ ఎం. శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేపట్టి, ముద్దాయిని అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించి, నిందితుడిపై న్యాయ స్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు. నిందితుడు పూసపాటిరేగ మండలం, పేరాపురం గ్రామంకు చెందిన పాండ్రంకి సురేష్(23) పై నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం పోక్సో (pocso) కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కే. నాగమణి 20సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.2,500లు జరిమానా విధించడంతోపాటు, బాధితురాలికి పరిహారంగా రూ.5 లక్షలు మంజూరు చేస్తూ జనవరి 19న తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ తెలిపారు.

బాధిత బాలికకు రూ.5 లక్షల పరిహారం

ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసులు తరుపున ఫోక్సో కోర్టు ఇన్చార్జ్ పబ్లిక్ ప్రాసిక్యూటరు ఎం. ఖజానారావు వాదనలు వినిపించారన్నారు. ఈ కేసులో క్రియాశీలకంగా పనిచేసి, నిందితుడిని శిక్షించబడే విధంగా సమర్థవంతంగా పని చేసిన అప్పటి విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, పూసపాటిరేగ ఎస్ఐ దుర్గా ప్రసాద్, సి.ఎం.ఎస్. హెచ్.సి.సిహెచ్.రామకృష్ణ, కోర్టు ఎఎస్ఐ పి. సురేష్ స్పెషల్ పిపి ఎం. ఖజానారావులను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870