ఆంధ్రప్రదేశ్ (AP) లో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఆధార్ స్పెషల్ క్యాంపులను నిర్వహించనున్నారు.. (AP) విద్యార్థుల ఆధార్ కార్డుల్లో మార్పులు, సవరణలు సులభంగా చేయించుకునేందుకు ఈ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.నేటి నుంచి ప్రారంభమైన ఈ క్యాంపులు 20 వరకు కొనసాగనున్నట్లు అధికారులు వివరించారు. ఆ తర్వాత 22 నుంచి 24 వరకు మరోసారి నిర్వహించనున్నట్లు తెలిపారు.
Read Also: Atchannaidu:దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు

ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేస్తారు
రాష్ట్రవ్యాప్తంగా పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోకుండా మిగిలి ఉన్నవారు తప్పక ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని..
చేయకపోతే స్కాలర్షిప్, రేషన్, ప్రభుత్వ పథకాల లాభాలు ఆగిపోవచ్చు అంటున్నారు. ఈ మేరకు 5–17 ఏళ్ల పిల్లలకు ఉచిత ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేస్తారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: