
Annadata Sukhibhava Surampalli event: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కృష్ణా జిల్లా సూరంపల్లిలో ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తూనే, రాష్ట్ర ప్రయోజనాలకు అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టుపై గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఆయన ఎండగట్టారు.
Read Also: SVSN Varma Chandrababu Photo Controversy: సీఎం ఫోటోపై రగడ..వర్మ ఆగ్రహం
ప్రాజెక్టును అనాథను చేశారు!
పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఈ జాతీయ ప్రాజెక్టుపై తీవ్ర నిర్లక్ష్యం (శీతకన్ను) ప్రదర్శించిందని ఆరోపించారు. “అనుభవం లేని ఇంజినీర్లను మార్చడం, రివర్స్ టెండరింగ్ పేరుతో సమయాన్ని వృథా చేయడం వల్ల ప్రాజెక్టు అనాథగా మారింది. కేవలం రాజకీయ స్వార్థం కోసం ప్రాజెక్టు పనులను అస్తవ్యస్తం చేసి రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొట్టారు” అని ఆయన మండిపడ్డారు.’
డయాఫ్రం వాల్ నష్టంపై సంచలన గణాంకాలు
ముఖ్యంగా ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్ దెబ్బతినడంపై చంద్రబాబు విస్తుపోయే వాస్తవాలు వెల్లడించారు. “మేము గతంలో రూ. 440 కోట్లతో పటిష్టంగా నిర్మించిన డయాఫ్రం వాల్ను గత ప్రభుత్వం నిర్వహణ లోపం వల్ల దెబ్బతీసింది. ఇప్పుడు దాని మరమ్మతులకు మరియు కొత్తగా నిర్మించడానికి ఏకంగా రూ. 1,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రజల సొమ్మును ఎలా వృథా చేశారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలకుల తప్పుడు నిర్ణయాల వల్ల ప్రాజెక్టు వ్యయం పెరగడమే కాకుండా, పూర్తి కావాల్సిన గడువు కూడా ఏడేళ్లు వెనక్కి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Annadata Sukhibhava Surampalli event: 2027 నాటికి పూర్తి చేస్తాం
ఎన్ని అడ్డంకులు ఎదురైనా 2027 పుష్కరాల లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు అంకితం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన పనులు సాగుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో సహకరిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులకు నేరుగా లబ్ధి చేకూర్చడంతో పాటు, ప్రాజెక్టు పనుల పురోగతిని ఆయన వివరించారు.
hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: