ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచే విధంగా ఇద్దరు యువ ప్రతిభావంతులు జాతీయ స్థాయిలో విశిష్ట గౌరవాన్ని సాధించారు. జాతీయ సేవా పథకం (National Service Scheme – NSS) కింద కేంద్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం దేశవ్యాప్తంగా అత్యుత్తమ సేవలు అందించిన వాలంటీర్లను గుర్తించి సత్కరిస్తుంది. 2022–23 సంవత్సరానికి గాను ఈ సారి ఎంపికైన అవార్డు గ్రహీతల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు చోటు దక్కించుకున్నారు.
AP: రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కీలక హెచ్చరికలు
రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan) లో సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా 2022–23 సంవత్సరానికి సంబంధించిన ‘మై భారత్ – ఎన్ఎస్ఎస్ అవార్డులు’ అందుకున్నారు.ఎం. పృథ్వీరాజ్ – నెల్లూరులోని విక్రమ్ సింహపురి విశ్వవిద్యాలయానికి చెందిన ఎన్ఎస్ఎస్ స్వయంసేవకుడు.

అవార్డులు అందుకున్న యువకులు
డి. జిష్ణురెడ్డి – నెల్లూరులోని నారాయణ డెంటల్ కళాశాల ఎన్ఎస్ఎస్ స్వయంసేవకుడు.ఈ ఇద్దరు యువకులు సామాజిక సేవ, ప్రజాహిత కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతుగా సేవలందించారు.
వీరి సేవా దృక్పథాన్ని గుర్తించి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను ప్రదానం చేశారు. వీరికి రాష్ట్రపతి ఒక్కొక్కరికి లక్ష రూపాయల నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందజేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: