Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణపై గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు మార్చి 7వ తేదీతో ముగియనున్నాయి. ఈ సమావేశాల అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఏప్రిల్లో వచ్చే ఉగాది పండుగ నాటికి కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండవచ్చని తెలుస్తోంది.
Read Also: Andhra Pradesh: రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన ఏపీ శాసనమండలి

మెగా బ్రదర్ నాగబాబుకు కీలక బాధ్యతలు?
ఈ విస్తరణలో జనసేన పార్టీ తరపున మెగా బ్రదర్ నాగబాబు(Naga Babu)కు మంత్రి పదవి దక్కడం దాదాపు ఖాయమని ప్రచారం సాగుతోంది. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న ‘సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్’ శాఖను ఆయనకు అప్పగించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలో జనసేన ప్రాధాన్యతను పెంచుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
కొందరు మంత్రులకు ఉద్వాసన?
టీడీపీకి చెందిన కొందరు మంత్రుల పనితీరుపై అసంతృప్తిగా ఉన్న అధిష్ఠానం, వారిని తప్పించి కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలని యోచిస్తోంది. సామాజిక సమీకరణాలు మరియు జిల్లాల వారీ ప్రాతినిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేయనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: