ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని, ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోటోలు ప్రదర్శించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ వ్యవహారంలో అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేయడంతో రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చకు దారితీసింది. విజయవాడకు చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి ఏము కొండలరావు ఈ పిటిషన్ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. డిప్యూటీ సీఎం పదవికి రాజ్యాంగ హోదా లేదని పిటిషనర్ తరఫున లాయర్ వాదనలు వినిపించారు.
Read Also: Andhra Pradesh: శాసనసభ రేపటికి వాయిదా

దీంతో మీకేం సమస్య
అయినా సరే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాల్లో (Andhra Pradesh) డిప్యూటీ సీఎం ఫోటోను ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ఇలా చేయడం వల్ల ప్రజాదనం దుర్వినియోగం జరుగుతోందన్నారు. ఈ వాదనల్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్వీ అంజారియా, జస్టిస్ జోయ్మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది.. అలాగే ఈ పిటిషన్ను కొట్టేసింది.
ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటో ప్రదర్శిస్తే.. మీకొచ్చిన బాధేంటి’ అంటూ పిటిషనర్ను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ‘దీంతో మీకేం సమస్య ఉంది.. ఇష్యూస్ సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నించొద్దు’ అంటూ పిటిషన్ను కొట్టివేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: