భక్తజన సందోహం నడుమ మల్లన్న తెప్పోత్సవం
శ్రీశైలం : మహాశివరాత్రి పురస్కరించుకొని నవాహిక దీక్షతో 11 రోజులపాటు నిర్వహింపబడే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 9వ రోజైన సోమవారం నాడు శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. తరువాత యాగశాల యందు శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపించబడ్డాయి. అనంతరం లోక కళ్యాణం కోసం జపాలు, పారాయణులు, చేశారు. అనంతరం మండపారాధనలు, పంచావరనార్చనలు, శివ పంచాక్షరి, నిత్య హోమాలు, రుద్రహోమం, చండీ హోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారం జరిపారు. అదే విధంగా సాయంకాలం ప్రదోషకాల పూజలు, జపాను స్థానాలు, రుద్ర పారాయణులు, హోమాలు చేశారు. మహాశివరాత్రి పర్వదినం మరుసటి రోజున సాయంకాలం స్వామి. అమ్మవార్ల రథోత్సవం అంగరంగ వైభవంగా జరిపారు. రథోత్సవంలో సాంప్రదాయాన్ని అనుసరించి ముందుగా రథాంగపూజ, రథాంగ హోమం, రథంగా బలి, కార్యక్రమాలు నిర్వహించారు.
Read also: Bill Gates: మంత్రులను పరిచయం చేసిన సీఎం

Srisailam Mallanna Chariot Festival a feast for the eyes
రధాంగ బలిలో వసంతముతో నింపిన గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, కుంభం (అన్నం రాసి) సాత్విక బలిగా సమర్పించారు. తరువాత శ్రీ స్వామి అమ్మవార్లను రథంపైకి వేంచేపు వేయించి రధోత్సవం జరిపించారు. రథోత్సవాన్ని పురస్కరించుకొని బంతి, చామంతి, గులాబీలు, కాగడాలు, కనకాంబరాలు, చాందిని, తదితర 11 రకాల వుష్పాలతో రథాన్ని అలంకరించడం జరిగింది. ఈ రథోత్సవ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, జిల్లా ఎస్పీ సునీల్ శరన్, ధర్మకర్తల మండలి అధ్యక్షులు పి. రమేష్ నాయుడు, శ్రీశైల దేవస్థానం ఈవో ఎం. శ్రీనివాసరావు, మండలి సభ్యులు, అధికారులు, అర్చక స్వాములు, భక్తులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తజన సందోహం నడుము మల్లన్న తెప్పోత్సవం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని రాత్రి 8 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవం నిర్వహించారు.
మల్లన్న తెప్పోత్సవం – పుష్కరిణిలో దివ్య దృశ్యం
ఆలయ పుష్కరిని వద్ద ఈ తెపోత్సవ కార్యక్రమం జరిపారు. ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను పోడ శోవచారపజల నిర్వహించబడ్డాయి. తరువాత ఉత్సవమూర్తులను ఆలయ రాజగోపురము నుండి పుష్పాలంకృత పల్లకిలో ఊరేగింపుగా తోడుకొని వచ్చి పుష్కరిణిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తెప్పపై వేంచేబు చేయించి విశేష పూజాదికాలు నిర్వహించారు. తరువాత మంగళ వాయిద్యాల నడుమ వేదమంత్రాలతో ఎంతో శాస్త్రకంగా ఈ తెప్పోత్సవం జరిగింది. కాగా వివిధ రకాల పుష్పాలతో చేసిన ప్రత్యేక అలంకరణతో విద్యుత్ దీపాలంకరణతో ఈ తెప్ప ఎంతో కళాత్మకంగా రూపొందించబడింది. తెప్పోత్సవాన్ని దర్శించుకోవడం వలన శ్రేయస్సు కలుగుతుంది, శత్రు బాధలు తొలగిపోతాయి, కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: