విజయవాడ : రాష్ట్రంలోని పలు విద్యాసంస్థల్లో వసతుల కోసం ఆర్థికశాఖ ప్రతిపాదనలు పంపామని త్వరలోనే పనులు పూర్తిచేస్తామని మంత్రి నారా లోకేశ్ (Nara lokesh) తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. పుట్టపర్తిలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు, పలు కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అక్కడి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి కోరారు. దీనికి మంత్రి లోకేశ్ సమాధానమిస్తూ పుట్టపర్తిలో ట్రిపుల్ ఐటీ ప్రతి పాదన లేదని ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. తిరుపతిలో భక్తుల రాక పెరిగినందున తాగునీరు మరింత అవసరమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు.
Read also: AP: కాకాణి గోవర్ధన్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన పోలీసులు

Proposals for accommodation in educational institutions: Minister Lokesh
గాలేరు నగరి, హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా నీరు అందించే విషయాన్ని పరిశీలించాలని ఆయన కోరారు. దీనికి మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు తగినట్లు నీటి సరఫరాలను పెంచుతామని చెప్పారు. బొబ్బిలి నియోజకవర్గంలో లోచర్ల శివదావలస ఎత్తిపోతల పథకంపై ఎమ్మెల్యే బేబినాయన ప్రశ్నించగా వైకాపా హయాంలో టెంబర్లు రద్దు చేసి పనులు నిలిపివేశారని మంత్రి రామానాయుడు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగుల బదిలీపై పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ప్రశ్నించారు. దీనికి మంత్రి సంధ్యారాణి సమాధానం చెప్పారు. వైకాపా ప్రభుత్వం హయాంలో కోర్టు కేసుల పరిష్కారానికి చొరవ తీసుకోనందువల్ల సమస్యలు వచ్చాయన్నారు. దీనిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: