हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

News telugu: Andhra Pradesh: ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియాపథకం అమలులో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానం

Sharanya
News telugu: Andhra Pradesh: ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియాపథకం అమలులో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానం

విజయవాడ: జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ) పథకాన్ని ఉపయోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజన నిలిచింది. ఏపీ విద్యాశాఖాధికారులు అందించిన సమాచారాన్ని అనుసరించి, దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక పాఠశాలలు ఎంపికైన మొదటి రాష్ట్రంగా ఏపీ (AP is the first state)నిలవగా జాతీయ స్థాయిలో ఉత్తరప్రదేశ్ తర్వాత మన రాష్ట్రం 2వ స్థానంలో నిలిచింది.

దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలలను కేంద్రం ఎంపిక

ఇందులో భాగంగా ఎంపికైన ప్రభుత్వ పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 14,500 పాఠశాలలను కేంద్రం ఎంపిక చేయగా రాష్ట్రం నుంచి 982 పాఠశాలలు ఉన్నాయి. కేంద్రీయ, నవోదయ విద్యాలయాలను మినహాయిస్తే మన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు 935 ఈ పథకానికి ఎంపికయ్యాయి. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) 1,725 పాఠశాలలతో అత్యధికంగా ప్రయోజనం పొందిన రాష్ట్రంగా 1వ స్థానంలో ఉంది. ఈ ఏడాది 80 పాఠశాలలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. గ్రీన్ స్కూల్స్ గా అభివృద్ధి చేయడం, సౌర విద్యుత్తు ఉత్పత్తి, నీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ వంటి పర్యావరణ అనుకూల చర్యలను ప్రోత్సహిస్తున్నారు. పీఎంశ్రీ, ఆటిజం కేంద్రాలు, నో బ్యాగ్ డే, స్కౌట్స్, పర్సనలైజ్ అడాప్టివ్ లెర్నింగ్ లాంటి వాటితో ఏపీ విద్యా వ్యవస్థకు ప్రభుత్వం కొత్త నిర్దేశం చేస్తోందని ఎస్ఎస్ఏ ఎస్పీడీ బీ.శ్రీనివాసరావు చెప్పారు. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దిశగా రాష్ట్రం పయనిస్తోందని విద్యార్థుల సంపూర్ణ విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. మొబైల్ యాప్ ద్వారా నిధుల వినియోగం, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ప్రతి పాఠశాలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ఏటా పాఠశాల నిర్వహణ నిధులు అందిస్తున్నారు. పీఎంశ్రీ కింద ఈ ఏడాది రూ.494 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. తాజాగా ఇచ్చిన 80 పాఠశాలలకు అదనంగా మరో రూ.87 కోట్లు విడుదల చేసింది. ఈ పాఠశాలల్లో మోలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

PM-SHRI పథకం అంటే ఏమిటి?

PM-SHRI అంటే “Pradhan Mantri Schools for Rising India”. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం, దీని ద్వారా దేశవ్యాప్తంగా మోడల్ స్కూల్స్‌గా ఎంపికైన ప్రభుత్వ పాఠశాలలకు ఆధునిక వసతులు, డిజిటల్ టెక్నాలజీ, స్మార్ట్ తరగతులు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు వంటి సౌకర్యాలు కల్పించబడతాయి.

ఈ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానం లో ఉంది?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచింది. ఈ పథకాన్ని అత్యుత్తమంగా అమలు చేస్తున్న రాష్ట్రంగా గుర్తింపు పొందింది.

Read hindi news: hindi.vaartha.com

Read also: News telugu: Parthasaradi: 16 మాసాల వ్యవధిలోనే హామీలన్నింటిని అమలు చేస్తున్నాం: మంత్రి కొలుసు పార్ధసారధి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870