మేడారం జాతర సందర్భంగా చోటుచేసుకున్న ఘటనపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ కొనసాగుతోంది. జాతరలో కోవా బన్ను విక్రయించిన వలి అనే వ్యక్తితో ఓ యూట్యూబర్ అనుచితంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ ఘటనలో వలికి అనేకమంది మద్దతుగా నిలిచారు. సాధారణ జీవనోపాధి కోసం వ్యాపారం చేస్తున్న వ్యక్తిని టార్గెట్ చేయడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. తాజాగా ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రి లోకేశ్ స్పందించారు.
Read Also: Telangana: కోవా బన్ వ్యవహారంపై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం

వలీకి మద్దతు
‘వలి.. మీరు ఇలాంటివి భరించాల్సి రావడం బాధాకరం. తెలుగు సమాజంలో సామరస్యం, గౌరవం, సోదరభావం తప్ప మతపరమైన విద్వేషాలకు చోటు లేదు. మిమ్మల్ని త్వరలో కలిసి కోవా బన్ను టేస్ట్ చేస్తా’ అని అన్నారు.ఇక ఇప్పటికే పరిటాల శ్రీరామ్, బైరెడ్డి శబరి వంటి టీడీపీ నేతలు కూడా వలీకి సపోర్ట్ చేశారు. కోవా బన్ వ్యాపారి వలీకి సంఘీభావం తెలుపుతూ ట్వీట్లు చేశారు. ఆకలికి కులం ఉండదని..
ఆత్మగౌరవానికి మతమనేది ఉండదని.. అలాగే కష్టానికి పార్టీ రంగు ఉండదంటూ వలీకి మద్దతు ప్రకటించారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేయటం సులువేనని.. కానీ ఆ వ్యక్తి బాధను చూడడానికి, సహాయం చేసేందుకు చాలా ధైర్యం కావాలంటూ ట్వీట్లు చేశారు. నిజ నిజాలు తెలుసుకోకుండా కష్టపడి పనిచేసుకునే ఓ చిరు వ్యాపారి మీద నిందలు వేయడం సరైందని కాదని అభిప్రాయపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: