Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుకు సంబంధించిన వివిధ సేవలపై యూజర్ ఛార్జీలను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న రుసుములను ఇప్పుడు సవరించారు. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు నుంచి చిరునామా మార్పు వరకు అన్నింటికీ అదనపు భారం తప్పదు. ఈ నిర్ణయం వెంటనే అమలులోకి రానుంది.
Read Also: Women’s Day 2026: మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్
పెరిగిన సేవల ధరలు
రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం ప్రభుత్వం లబ్దిదారులకు అవకాశం కల్పించింది. కాగా, వీరికి సంబంధించి రైస్ కార్డ్ దరఖాస్తు సేవ రుసుం (సర్వీస్ ఛార్జ్)లను పెంచింది. కొత్త రైస్ కార్డ్, డూప్లికేట్ రైస్ కార్డ్, రైస్ కార్డులో సభ్యుల చేర్పు, తొలగింపు, వివరాల సవరణ, చిరునామా మార్పుతో పాటు రైస్ కార్డ్ విభజన వంటి అన్ని సేవల దరఖాస్తు సేవా ఛార్జీలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రూ. 24 సేవా రుసుం కలిగిన సేవలు రూ.100కు పెంచారు.

అదే విధంగా రూ 48గా ఉన్న రైస్ కార్డ్ విభజన సేవ రూ.200కు పెరిగింది. ఇక.. మీసేవ, స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయం, సిటిజన్ పోర్టల్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వివిధ రకాల రైస్ కార్డ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. రేషన్ కార్డు పోగొట్టుకున్న వారికి డూప్లికేట్ కార్డు పొందాలన్నా.. వివరాలు తప్పుగా ఉంటే సరి చేసుకునేందుకు.. అదే విధంగా ఉన్న సభ్యులను తొలిగించటం.. చిరునామా మార్పు.. కార్డు స్ప్లిట్ వంటి వాటి కోసం ఈ సర్వీసు ఛార్జీల్లో మార్పులు జరిగాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: