
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), శాసనసభలో సీఎం చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. అసెంబ్లీ వేదికగా మాట్లాడిన ఆయన, వైసీపీ పాలన సమయంలో తనకు జరిగిన అవమానాలను గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు.‘2019-24 మధ్య నాలా కన్నీళ్లు పెట్టుకున్నవారెందరో ఉన్నారు. నా జీవితంలో నేనెప్పుడూ కన్నీళ్లు పెట్టుకోలేదు. నోటీసులు ఇవ్వకుండా నన్ను అరెస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటనను అడ్డుకున్నారు. నాడు మమ్మల్ని అడ్డకున్నవాళ్లు.. ఇవాళ నీతులు చెబుతున్నారు’ అని చంద్రబాబు అన్నారు.
Read Also: Chandrababu: రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతాం
పెన్షన్ల కోసం ఏటా రూ.34 వేల కోట్లు ఖర్చు
రాష్ట్ర పునర్నిర్మాణం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తుంటారని.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 94 శాతం స్ట్రైక్రేట్తో తమను గెలిపించారని తెలిపారు. పెన్షన్ల కోసం ఏటా రూ.34 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏదీ లేదని చెప్పుకొచ్చారు.
ఈ ఏడాదిలో 1,000 ఏసీ బస్సులను తీసుకొస్తున్నామన్నారు. 20 నెలల్లో ఇంత చేయగలిగామా.! అని ఆశ్చర్యపోయేలా అందరూ సహకరించారని తెలిపారు. విభజన జరిగడం వల్ల రాష్ట్రానికి కొంత మేర నష్టం వాటిల్లిందని ప్రస్తావించారు. నాడు ఏ వైపూ తాను సపోర్టు చేయకుండా తటస్ధంగా ఉన్నానని వివరించారు. 2014-2019 మధ్య ఏడాదిలోనే అసెంబ్లీ కట్టామని.. ఇక్కడ అసెంబ్లీ రావడానికి కారణం 29వేల మంది రైతులు 33 వేల ఎకారాల భూమిని ఇచ్చారని తెలిపారు. వారికి పైసా కూడా ఇవ్వలేకపోయామన్నారు. అయితే అదే టెంపో కంటిన్యూ అయి ఉంటే రికవర్ అయ్యేవాళ్లమని చెప్పుకొచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: