Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పెంచిన విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించినట్లు ప్రకటించారు. గతంలో ప్రజలపై వేసిన ట్రూ అప్ ఛార్జీల భారాన్ని తొలగించడమే కాకుండా, ఇప్పుడు ట్రూ డౌన్ ఛార్జీల విధానాన్ని అమలులోకి తెచ్చారు. దీని ద్వారా ఒక్కొక్క యూనిట్కు 13 పైసల చొప్పున ధర తగ్గించనున్నట్లు వెల్లడించారు.
Read Also: Chandrababu Naidu: వచ్చే ఏడాదికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం

సోలార్ విద్యుత్ వైపు అడుగులు
రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులపై ఉన్న సుమారు ₹4,498 కోట్ల భారాన్ని తొలగించినట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విద్యుత్ రంగాన్ని గాడిలో పెడుతూనే, సామాన్యుడిపై ఆర్థిక భారం పడకుండా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలకు నెలవారీ కరెంట్ బిల్లుల్లో ఊరటనివ్వనుంది. విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం ‘సూర్య ఘర్’ పథకాన్ని వేగవంతం చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో ఒక లక్ష ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ అమర్చడం పూర్తయిందని వెల్లడించారు. వచ్చే ఏప్రిల్, మే నెలల నాటికి మరో ఆరు లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: