हिन्दी | Epaper

Andhra Pradesh: శ్రీకాళహస్తీశ్వరుని ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

Rajitha
Andhra Pradesh: శ్రీకాళహస్తీశ్వరుని ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

పంచభూత లింగాలలో వాయులింగేశ్వరుడిగా స్వయంభువుగా వెలసిన శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తుడు కన్నప్ప శ్రీకజారోహణంతో ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. పురాణాల ప్రకారం భోళాశంకరుడు తన పరమభక్తుడు తిన్నడు (భక్తకన్నప్ప)కు తొలి పూజల ప్రసాదం అందించిన ఆచారం నేటికీ కొనసాగుతోంది. సాయంత్రం భక్తకన్నప్ప కొండపై శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా చేపట్టారు. కన్నప్ప విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి కొండపైకి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆలయ ప్రధానార్చకులు డాక్టర్ ఎస్‌.ఎం‌.కె. స్వామినాథన్ గురుకుల్ కలశస్థాపన చేయగా, వేదపండితులు వేదమంత్రాల మధ్య పూజలు నిర్వహించారు. అనంతరం పంచలోహ కవచంతో అలంకరించిన ధ్వజస్తంభంపై పవిత్ర వస్త్రాన్ని అధిరోహింపజేసి “హరహర మహాదేవ” నినాదాల మధ్య ఉత్సవాన్ని ప్రారంభించారు.

Read also: TTD: భక్తులకు ఇక సులభంగా లడ్డూ ప్రసాదం

Andhra Pradesh

Brahmotsavams begin with the hoisting of the flag of Sri Kalahastivara

ధ్వజస్తంభాల ప్రత్యేకత మరియు విజయస్థంభం చరిత్ర

శ్రీకాళహస్తీశ్వరాలయంలో Srikalahasteeswara temple ధ్వజస్తంభాలకు ప్రత్యేక స్థానం ఉంది. సాధారణంగా ఆలయాల్లో ఒకే ధ్వజస్తంభం ఉండగా, ఇక్కడ ప్రధాన ద్వారం వద్ద సుమారు నలభై అడుగుల ఎత్తైన ఏకశిలా రాతి స్థంభం దర్శనమిస్తుంది. శ్రీకృష్ణదేవరాయలు విజయయాత్ర సందర్భంగా నిర్మించిన ఈ స్థంభంపై నంది విగ్రహాన్ని ప్రతిష్టించారు. అదేవిధంగా గురుదక్షిణామూర్తి సమీపంలో బంగారు ధ్వజస్తంభం, ఆలయంలోపల మరో తాపటం ధ్వజస్తంభం ఉన్నాయి. ఈ విజయస్థంభం చుట్టూ ప్రస్తుతం రక్షణ కంచె ఏర్పాటు చేయడంతో భక్తులు కోట మండపం వద్ద నుంచి నందిని దర్శించుకుంటున్నారు. గతంలో మహిళా భక్తులు ఇక్కడ నేతి దీపాలు వెలిగించే ఆనవాయితీ ఉండేది. ఈ ఆలయ నిర్మాణ వైశిష్ట్యం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది.

ప్రత్యేక పూజా విధానాలు మరియు ఉత్సవ వైభవం

శ్రీకాళహస్తీశ్వరుని ఆలయంలో పూజా విధానం ఇతర శివాలయాలకంటే భిన్నంగా ఉంటుంది. ఇక్కడ మూలవిరాట్టును ప్రత్యక్షంగా తాకరు శంఖంతోనే అభిషేకాలు నిర్వహించి నవగ్రహ కవచానికే అలంకరణలు సమర్పిస్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పదమూడు రోజులపాటు దేవస్థానం తరఫునే ఉభయదారులుగా పూజలు నిర్వహిస్తారు. ధ్వజారోహణ వేడుకలో పంచమూర్తుల కలశాలను నాలుగు దిక్కులా ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా ఆరాధనలు చేస్తారు. భక్తులు సమర్పించిన చీరలను ధ్వజస్తంభంపై అధిరోహించడం ఇక్కడి ప్రత్యేక సంప్రదాయం. ప్రతి సంవత్సరం భక్తుల మొక్కులు నెరవేరుతాయనే విశ్వాసంతో చీరల సమర్పణ గణనీయంగా పెరుగుతోంది. శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోయింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి జాన్వీ క‌పూర్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి జాన్వీ క‌పూర్

అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీరామ బ్రహ్మోత్సవాలు

అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీరామ బ్రహ్మోత్సవాలు

గువాహతిలోని కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్

గువాహతిలోని కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్

టీటీడీ ఛైర్మన్ ను తక్షణమే తొలగించాలంటూ నారాయణ డిమాండ్

టీటీడీ ఛైర్మన్ ను తక్షణమే తొలగించాలంటూ నారాయణ డిమాండ్

ఈ నెల వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

ఈ నెల వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

జై ఆంధ్రాతో కవిత కొత్త స్వరం

జై ఆంధ్రాతో కవిత కొత్త స్వరం

తిరుమలకు బయలుదేరిన కవిత
0:11

తిరుమలకు బయలుదేరిన కవిత

కుంభాభిషేక ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు.. మంత్రి ఆనం

కుంభాభిషేక ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు.. మంత్రి ఆనం

ఏప్రిల్ 18 నుంచి గుడిమల్లం కుంభాభిషేకం

ఏప్రిల్ 18 నుంచి గుడిమల్లం కుంభాభిషేకం

కొండగట్టు అంజన్న క్షేత్రం కొత్త ఈఓగా రమాదేవి

కొండగట్టు అంజన్న క్షేత్రం కొత్త ఈఓగా రమాదేవి

తిరుమలలో చిరుతపులి సంచారంతో భక్తుల ఆందోళనలు

తిరుమలలో చిరుతపులి సంచారంతో భక్తుల ఆందోళనలు

ఢిల్లీ లిక్కర్ కేసు క్లీన్‌చిట్ తో శ్రీవారికి మొక్కులు తీర్చుకోనున్న కవిత

ఢిల్లీ లిక్కర్ కేసు క్లీన్‌చిట్ తో శ్రీవారికి మొక్కులు తీర్చుకోనున్న కవిత

📢 For Advertisement Booking: 98481 12870