हिन्दी | Epaper

Andhra Pradesh: కల్తీ పాల ఘటనలో మరొకరు బలి 10కి చేరిన మరణాలు

Saritha
Andhra Pradesh: కల్తీ పాల ఘటనలో మరొకరు బలి 10కి చేరిన  మరణాలు

Andhra Pradesh: రాజమండ్రిని కల్తీ పాల ఉదంతం వణికిస్తోంది. రోజురోజుకూ మరణాల సంఖ్య పెరుగుతుండటంతో స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా శనివారం మరో మరణం సంభవించడంతో ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10కి చేరుకుంది. శనివారం అనంతలక్ష్మి (72) అనే వృద్ధురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

Read Also: Vijayawada Crime: పోలీసులపై కాల్పులకు దుండగుడి యత్నం

Andhra Pradesh: కల్తీ పాల ఘటనలో మరొకరు బలి 10కి చేరిన  మరణాలు
Andhra Pradesh: Another death in adulterated milk incident, death toll reaches 10

మరో వృద్ధురాలు బలి

కల్తీ పాలు తాగడం వల్ల తలెత్తిన ఆరోగ్య సమస్యలతో ఆమె గత కొన్ని రోజులుగా పోరాడుతున్నారు. వైద్యులు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో మరో 10 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురు చిన్నపిల్లలు ఉండటం అందరినీ కలచివేస్తోంది. ఆరుగురి పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. విషపూరిత పదార్థాల ప్రభావం వల్ల కిడ్నీలు దెబ్బతినడంతో వారికి వెంటిలేటర్‌పై డయాలసిస్ నిర్వహిస్తున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు నిరంతరం శ్రమిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870