Anantapur Crime: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన చోటుచేసుకుంది.. డి.హీరేహాల్ మండలం కళ్యం గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు, మొబైల్ రీఛార్జ్ కోసం తండ్రిని రూ.100 అడిగాడు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో తండ్రి ఆ మొత్తాన్ని ఇవ్వలేకపోయాడు. ఈ చిన్న విషయమే పెద్ద విషాదానికి దారితీసింది. మనస్తాపానికి గురైన నవీన్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Read Also: Shubman Gill dance: సచిన్ కుమారుడి ప్రీ-వెడ్డింగ్ పార్టీలో శుభ్మన్ గిల్ స్టెప్పులు
తీవ్ర విషాదం
నవీన్ ను గమనించిన కుటుంబసభ్యులు.. వెంటనే అతన్ని బళ్ళారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే నవీన్ పరిస్థితి విషమించింది.. చికిత్స పొందుతూ నవీన్.. ఆసుపత్రిలో చనిపోయాడు. దీంతో ఒక్కగానొక్క కొడుకు మొబైల్ రీఛార్జ్ కు డబ్బులు ఇవ్వలేదన్న చిన్న కారణంతో ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

ముగ్గురు కూతుళ్లను చదివిస్తూ.. చాలీచాలని ఆదాయంతో.. కౌలు రైతుగా పనిచేస్తున్న రామకృష్ణ ఒక్కగానొక్క కొడుకు నవీన్ ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా యువకుడు నవీన్ తొందరపడి తీసుకున్న నిర్ణయం.. తల్లిదండ్రులను పుట్టెడు దుఃఖంలోకి నెట్టింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: