हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Amaravati: అమరావతి ఓఆర్ఆర్‌లో మొదలైన భూసేకరణ

Sushmitha
Telugu News: Amaravati: అమరావతి ఓఆర్ఆర్‌లో మొదలైన భూసేకరణ

రాజధాని అమరావతికి(Amaravati) తలమానికంగా నిలవనున్న ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) నిర్మాణంలో అత్యంత కీలకమైన ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను(Land acquisition) జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారికంగా ప్రారంభించింది. ఇందులో భాగంగా తొలిదశలో పల్నాడు జిల్లాకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ (3ఏ) విడుదలైంది. త్వరలోనే దీనిని పత్రికల్లో ప్రకటించి, ప్రజల అభ్యంతరాలను స్వీకరించనున్నారు.

Read Also: Atchannaidu:ఉల్లి రైతులకు హెక్టారుకు ₹50,000 ఆర్థిక సాయం

Amaravati
Amaravati

పల్నాడులో భూసేకరణ వివరాలు

పల్నాడు(Palnadu) జిల్లాలోని రెండు మండలాల పరిధిలో 17.230 కిలోమీటర్ల పొడవున భూమిని సేకరించనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ గెజిట్‌లో స్పష్టం చేసింది. ఓఆర్‌ఆర్ పరిధిలోకి వచ్చే భూముల సర్వే నంబర్లు, యజమానుల వివరాలను ఇందులో పొందుపరిచారు. ఈ నోటిఫికేషన్‌పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, 21 రోజుల్లోగా భూసేకరణ అధికారికి తెలియజేయాలని సూచించారు.

  • అమరావతి మండలం: దిడుగు, నెమలికల్లు గ్రామాల పరిధిలో 565.87 ఎకరాలు.
  • పెదకూరపాడు మండలం: ఏడు గ్రామాల పరిధిలో 607.48 ఎకరాలు.

ఈ రెండు మండలాల్లో కలిపి మొత్తం 990 మంది రైతుల నుంచి భూములను తీసుకోనున్నారు. ఇందులో పట్టా, ప్రభుత్వ, అసైన్డ్, ఈనాం భూములు ఉన్నాయి.

గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల పరిస్థితి

అమరావతి ఓఆర్‌ఆర్ నిర్మాణంలో గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు అత్యంత కీలకం కానున్నాయి. ఓఆర్‌ఆర్ ఎక్కువగా ఈ జిల్లాల నుంచే వెళ్లనుంది:

  • గుంటూరు జిల్లా: అత్యధికంగా 11 మండలాల్లోని 40 గ్రామాల మీదుగా 67.650 కిలోమీటర్ల మేర భూసేకరణ జరగాల్సి ఉంది. దీనికి సంబంధించిన గెజిట్ వారం పది రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.
  • కృష్ణా జిల్లా: 5 మండలాల్లో 35.140 కిలోమీటర్ల మేర భూమిని సేకరించాలి.
  • ఎన్టీఆర్ జిల్లా: 4 మండలాల పరిధిలో 51.120 కిలోమీటర్ల మేర భూమిని సేకరించాల్సి ఉంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరులోగా ఐదు జిల్లాలకు సంబంధించిన గెజిట్ ప్రకటనలు పూర్తి చేస్తామని ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870