हिन्दी | Epaper

Andhrapradesh: విద్యార్థులను చెప్పుతో కొట్టిన టీచర్..స్పందించిన ఎంఈవో

Sharanya
Andhrapradesh: విద్యార్థులను చెప్పుతో కొట్టిన టీచర్..స్పందించిన ఎంఈవో

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో ఘోర ఘటన చోటుచేసుకుంది. చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దేది స్కూల్‌ కావాలి కానీ, అక్కడే అప్రతిష్ఠకర ఘటనలు చోటుచేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. స్థానిక జీనియస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు అనిత చిన్నారులపై ప్రవర్తించిన తీరు ప్రస్తుతం జిల్లా మొత్తంలో సంచలనం రేపుతోంది.

పిల్లలపై శారీరక దాడి

ధర్మవరంలోని జీనియస్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఒకరోజు హోం వర్క్ చేయకపోవడంతో ఉపాధ్యాయురాలు అనిత తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆ కోపంలో ఉపాధ్యాయురాలు అనిత వారిని చెప్పుతో కొట్టారు. తీరా తల్లిదండ్రులు తమ బిడ్డలను ఇంటికి తీసుకెళ్లిన తర్వాతే ఈ దాడి విషయం తెలిసింది.

తల్లిదండ్రుల ఆగ్రహం

విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఊరుకోలేదు. వెంటనే పాఠశాల వద్దకు చేరుకుని ఉపాధ్యాయురాలిని నిలదీశారు. పిల్లలు హోం వర్క్ చేయకపోతే చెప్పుతో కొట్టడమేంటి?, ఇదేనా బోధనా విధానం? అంటూ తీవ్ర ఆగ్రహంతో ప్రశ్నించారు. మానవత్వం కోల్పోయిన ఉపాధ్యాయురాలిపై నేరుగా దాడికి దిగారు. ఈ ఉదంతం కారణంగా పాఠశాల వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పాఠశాల వద్ద జరుగుతున్న ఉద్రిక్తత సమాచారం వన్‌టౌన్ పోలీసులకు చేరింది. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులతో మాట్లాడి శాంతింపజేశారు. స్కూల్ యాజమాన్యాన్ని కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఎంఈవో గోపాల్ నాయక్ స్పందించారు. విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని తెలిపారు.

Read also: Ontimitta temple: నేడు ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి వారి కల్యాణోత్సవం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870