हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Andhra Pradesh: ఏపీలో మళ్ళీ వడగండ్ల వాన సూచన

Sharanya
Andhra Pradesh: ఏపీలో మళ్ళీ వడగండ్ల వాన సూచన

ఏపీ పలు జిల్లాల్లో అకాల వర్షాల వల్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వర్షాలతో పాటు ఈదురు గాలులు, వడగళ్ల వాన రైతులకి మరింత ఇబ్బందిగా మారింది. చేతికి అందివచ్చిన పంట నీటిలో మునిగిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వరి, మిర్చి, మొక్కజొన్న, కంది పంటలు విస్తారంగా దెబ్బతిన్నాయి. వర్షం కారణంగా కోతకు సిద్ధంగా ఉన్న పంట తడిసి, నాణ్యత కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.

rains 1

వాతావరణ శాఖ హెచ్చరికలు

వాతావరణ శాఖ ప్రకారం, మరిన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుంది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో ఏపీకి వర్షాభాస్యం నెలకొంది. విదర్భ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించడంతో మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. ముఖ్యంగా- ఓపెన్ ప్రదేశాల్లో ఉండకూడదు. చెట్ల కింద దాగకుండా ఉండాలి. ఫోన్, టీవీల వంటివి వాడటం తగ్గించాలి. ఎలక్ట్రానిక్ పరికరాల ప్లగ్ లు తీసేయాలి. వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించే దిశగా చర్యలు తీసుకుంటోంది. అధికారులను రంగంలోకి దింపి పంట నష్టాన్ని అంచనా వేయాలని సీఎం ఆదేశించారు. నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పంట చేతికొచ్చిన తరుణంలో వరద నీటిలో మునిగిపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన వారు ఈ దెబ్బతో మరింత కుంగిపోతున్నారు. వర్షపాతం కారణంగా తడిసిన పంటలకు మార్కెట్‌లో ధర కూడా తగ్గిపోతుండడం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870