ambati rayudu

BJPలోకి అంబటి రాయుడు?

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయ రంగంలో కొత్త అడుగులు వేయనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఏబీవీపీ (అఖిల భారత విద్యార్థి పరిషత్) సభలో ఆయన పాల్గొనడం, బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ పార్టీ దేశం కోసం పనిచేసే ఒకే పార్టీ అని రాయుడు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీపై ఆయనకి ఉన్న అభిమానం తెలిపాయి.

రాయుడు రాజకీయ ప్రయాణం ఇప్పటికే వివిధ మలుపులు తీసుకుంది. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన, కొంతకాలానికే ఆ పార్టీని విడిచిపెట్టారు. ఆ తర్వాత జనసేన పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. అయినప్పటికీ, ఆయన రాజకీయంగా స్థిరపడలేకపోయారు. ఇప్పుడు బీజేపీలో చేరే అవకాశాలపై వార్తలు వినిపిస్తుండటంతో ఆయన తదుపరి అడుగు ఏంటనే ఉత్కంఠ నెలకొంది.

ambati rayudubjp

బీజేపీ..ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో తన బలాన్ని పెంచుకునేందుకు ట్రై చేస్తుంది. ముఖ్యంగా యువత మరియు క్రీడాకారుల మద్దతు సంపాదించడం కోసం కొత్త నేతలను ఆహ్వానిస్తోంది. అంబటి రాయుడు వంటి క్రికెటర్ చేరిక బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన పేరు, ప్రసిద్ధి వల్ల యువతలో బీజేపీకి చేరువ కావడానికి ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. అదేవిధంగా, రాయుడు స్వయంగా ఒక క్రీడాకారుడిగా దేశానికి సేవ చేసిన వ్యక్తి కావడం, బీజేపీ దేశభక్తి నినాదాలకు అనుకూలంగా ఉంటుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. దీనితోపాటు, ఆయన బీజేపీ నాయకత్వంతో కలిసిపనిచేయగలరా అనే ప్రశ్న కూడా కీలకంగా మారింది.

Related Posts
నూతన షోరూమ్‌తో కార్యకలాపాలను విస్తరించిన ప్యూర్ ఈవీ
Pure EV expands operations with new showroom

హైదరాబాద్‌: భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటైన ప్యూర్ ఈవీ , ఈరోజు హైదరాబాద్‌లో తమ అతిపెద్ద షోరూమ్‌లలో ఒకదానిని ప్రారంభించినట్లు వెల్లడించింది. సికింద్రాబాద్‌లో Read more

భారీగా కోడి పందేల ఏర్పాట్లు
kodi pandalu

సంక్రాంతి పండుగ సీజన్ వస్తే చాలు ఆంధ్రప్రదేశ్ లో కోడి పందేల జోరు కొనసాగుతుంది. కోట్లాది రూపాయలు ఈ పందేరంలో పెడతారు. సంక్రాంతి పండుగ వేళ కోడి Read more

ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ముందు వీరికే ప్రాధాన్యం – సీఎం రేవంత్
CM Revanth is ready to visit Davos

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పేదవారి సొంతింటి కలను సాకారం Read more

శ్రీశైలంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ అధికారులు మెరుపు దాడులు
director of revenue intelligence

సముద్ర గర్భంలో లభించేటటువంటి కోరల్స్ జాతికి చెందిన వాటిని సేకరించి, వాటిని విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందడంతో డైరెక్ట్ రేట్ అఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దాడులు చేసినట్టుగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *