టాప్-5 నగరాల్లో ఒకటిగా అమరావతి అభివృద్ధి!

టాప్-5 నగరాల్లో ఒకటిగా అమరావతి అభివృద్ధి!

రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రులకు కొత్త రాజధానిగా అమరావతి ప్రాంతం ప్రతిపాదించబడిన సంగతి తెలిసిందే. అయితే రాజకీయ పార్టీల మార్పుల ఈ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్మేసి.. ఆలస్యం చేస్తూ వచ్చింది. అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావటంతో దీని పనులను ప్రస్తుతం వేగవంతంగా ముందుకు నడిపించాలని చూస్తోంది.

Advertisements

ప్రపంచశ్రేణి రాజధాని నగరంగా..
వివరాల్లోకి వెళితే అమరావతి రాజధాని ప్రాంతంలో దాదాపు 5 వేల ఎకరాల కంటే పెద్దదిగా డిజైన్ చేయబడింది. అయితే గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు రాష్ట్రాన్ని ఆర్థికంగా కుంగదీసే అవకాశాల కారణంగా ప్రజలపై భారం పడకూడదనే ఉద్ధేశంతో పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీనికి ఒక చక్కడి పరిష్కారంతో ముందుకొచ్చింది. కేవలం రూ.64 వేల కోట్లతో రాజధాని అమరావతి నగర నిర్మాణాన్ని పూర్తి చేయవచ్చని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ప్రపంచశ్రేణి రాజధాని నగరంగా తీర్చిదిద్ది ప్రపంచంలోని టాప్-5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు.

టాప్-5 నగరాల్లో ఒకటిగా అమరావతి అభివృద్ధి!

అంతర్జాతీయ, జాతీయ స్థాయి విద్యాసంస్థలు

మెుత్తం అమరావతి కోసం సేకరించిన 5000 ఎకరాల్లో నిర్మాణం చేయనున్న ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రజల పన్నుల నుంచి వచ్చే సొమ్మును వినియోగించబోవటం లేదని అన్నారు. దీని వల్ల ప్రజలపై ఎలాంటి అదనపు పన్ను భారం ఉండబోదని నారాయణ వెల్లడించారు. అయితే ఈ 5,000 ఎకరాల భూమిలో 1,200 ఎకరాలు అంతర్జాతీయ, జాతీయ స్థాయి విద్యాసంస్థలు, పాఠశాలలు, పరిశ్రమల స్థాపనకు టాయించబడ్డాయి. అన్ని సదుపాయాలు కల్పించిన తరువాత మిగతా భూమిని మంచి ధరకు అమ్మి ఆ ఆదాయాన్ని రాజధాని నిర్మాణానికి తీసుకున్న అప్పులను తీర్చడానికి వినియోగించనున్నట్లు ఆయన చెప్పారు.

HUDCO, ADB బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ నుంచి నిధులు

సీఎం చంద్రబాబు నాయుడు తన అనుభవంతో ఆమరావతిని ఒక అద్భుతమైన నగరంగా రూపొల్పొడినట్లు నారాయణ చెప్పారు. ఆమరావతి రాజధాని నిర్మాణానికి రూ.64,000 కోట్ల అంగీకారం పొందగా.. ఇందులో రూ.50,000 కోట్ల టెండర్లు ఇప్పటికే పిలవబడ్డాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం కోసం HUDCO, ADB బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ నిధులు సమకూరుస్తున్నాయి. ఈ ఏడాది బడ్జెట్‌లో రాజధానికి రూ.6,000 కోట్లు కేటాయించబడ్డాయి.అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తానని సీఎం హామీ ఇచ్చారు. రాజధాని నిర్మాణంలో అంగీకరించిన నిధులపట్ల పారదర్శకతను పాటిస్తామని, ఎటువంటి మోసం జరగనీయబోమని నారాయణ అన్నారు. స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ ప్రకారం క్రమాన్ని అనుసరిస్తున్నామన్నారు మంత్రి. ఈ విషయంలో గత ప్రభుత్వాలు చేసిన విధంగా నిధులను దారిపోగొట్టడం జరుగకుండా కాపాడుకుంటున్నట్లు తెలిపారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రతిపక్షం చెప్పే మాటలను ప్రజలు నమ్మెుద్దని సూచించారు.

Related Posts
చంద్రబాబు లేఖపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Telangana CM Revanth Reddy responded to Chandrababu's letter

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన టీటీడీకి సంబంధించిన తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను ఆమోదించిన నేపథ్యంలో ఈ కృతజ్ఞతలు Read more

AP Supplementary exams: ఏపీలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
AP Supplementary exams: ఏపీలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పదో తరగతి (SSC) పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు ఏప్రిల్‌ 23న విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో మొత్తం 6,14,459 మంది విద్యార్థులలో 4,98,585 మంది ఉత్తీర్ణత Read more

త్వరలో భారత్ లోకి టెస్లా ఎంట్రీ – మంత్రి వాసంశెట్టి సుభాష్
vasam

ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వాహన పరిశ్రమలో ఓ విప్లవాత్మక మార్పును తీసుకొచ్చిన టెస్లా త్వరలోనే భారత్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించబోతుందని సమాచారం. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఈ దిగ్గజ Read more

K Annamalai: విజయసాయిరెడ్డి స్థానంలో రాజ్యసభకు అన్నామలై
K Annamalai: విజయసాయిరెడ్డి స్థానంలో రాజ్యసభకు అన్నామలై

అన్నామలై రాజకీయ యాత్రలో కొత్త మలుపు మాజీ ఐపీఎస్ అధికారి, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై పేరు ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. Read more

×