हिन्दी | Epaper

All-Party Meeting: ఆపరేషన్ సింధూర్ పై అఖిలపక్ష సమావేశం

Shobha Rani
All-Party Meeting: ఆపరేషన్ సింధూర్ పై అఖిలపక్ష సమావేశం

ఆపరేషన్ సింధూర్ గురించి అన్ని రాజకీయ పార్టీలకు వివరించడానికి కేంద్రం గురువారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఉదయం 11 గంటలకు రాజ్‌నాథ్‌ అధ్యక్షతన అన్ని పార్టీల నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్‌ షా, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, జై శంకర్‌, కిరణ్‌ రిజిజు సహా పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, వివిధ రాజకీయ పార్టీల నేతలు(All-Party Meeting) హాజరయ్యారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ నుంచి సందీప్ బందోపాధ్యాయ, డీఎంకేకు చెందిన టీఆర్ బాలు సమావేశంలో పాల్గొన్నారు.
హాజరైన ప్రముఖులు
ఇతర ప్రతిపక్ష నాయకులలో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రామ్ గోపాల్ యాదవ్, ఆప్‌కు చెందిన సంజయ్ సింగ్, శివసేన (యూబీటీ)కి చెందిన సంజయ్ రౌత్, ఎన్‌సీపీ (ఎస్పీ)కి చెందిన సుప్రియా సులే, బీజేడీకి చెందిన సస్మిత్ పాత్రా, సీపీఐ(ఎం)కి చెందిన జాన్ బ్రిట్టాస్ ఉన్నారు. ఈ సమావేశంలో పాక్‌పై భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ (‘Operation Sindoor’) వివరాలను రక్షణ మంత్రి పంచుకుంటున్నారు.

All-Party Meeting: ఆపరేషన్ సిందూర్ పై అఖిలపక్ష సమావేశం
All-Party Meeting: ఆపరేషన్ సిందూర్ పై అఖిలపక్ష సమావేశం

ఇక‌, ఈ అఖిల పక్ష సమావేశం గురించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బుధవారం ఎక్స్ (ట్విట్ట‌ర్‌)లో పోస్ట్ చేశారు. “2025 మే 8న ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలోని పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలోని కమిటీ రూమ్: G-074లో ప్రభుత్వం అఖిల పక్ష నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది” అని ఆయన అన్నారు.
సభ ఉద్దేశ్యం – ప్రతిపక్షాలకు భద్రతా సమాచారం పంచుకోవడమే
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ లో పర్యాటకులపై దాడికి పాల్పడి 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఆ ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై బుధవారం తెల్లవారుజామున తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో ప్రతిదాడికి దిగి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)తో పాటు పాకిస్థాన్‌లోని మూడు ప్రధాన ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్‌, లష్కరే తాయిబా, హిజ్బుల్‌ ముజాహిదీన్‌లకు చెందిన తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పాక్షికంగా కాకుండా, రాజకీయాలకతీతంగా దేశ భద్రతకు మద్దతు అవసరం అనే దృక్పథంతో ఈ అఖిలపక్ష సమావేశం సాగింది. ఇది దేశ ప్రజలకు భద్రతా పరిరక్షణలో ప్రభుత్వ కట్టుబాటును చూపించింది.

Read Also: Operation Sindoor: పాక్ సరిహద్దు గ్రామాల ప్రజల ఆవేదన అంతా ఇంతా కాదు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మృతి

డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మృతి

మార్చి 14నే ‘పై డే’ ఎందుకు? ఐన్‌స్టీన్ బర్త్‌డేకి, 3.14కి ఉన్న లింక్ ఏంటి?

మార్చి 14నే ‘పై డే’ ఎందుకు? ఐన్‌స్టీన్ బర్త్‌డేకి, 3.14కి ఉన్న లింక్ ఏంటి?

AI నేర్చుకోకపోతే ప్రమోషన్ లేదు.. ఉద్యోగం కూడా కష్టమే!

AI నేర్చుకోకపోతే ప్రమోషన్ లేదు.. ఉద్యోగం కూడా కష్టమే!

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

📢 For Advertisement Booking: 98481 12870