Bill Gates:రెండేళ్లలో ఏఐ అన్నింటినీ మార్చేస్తుంది: బిల్ గేట్స్

Bill Gates:రెండేళ్లలో ఏఐ అన్నింటినీ మార్చేస్తుంది: బిల్ గేట్స్

ప్రపంచంలోని ప్రముఖ సంపన్నులలో ఒకరైన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇటీవల ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జీరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్‌కాస్ట్ లో గత ఏడాది  పాల్గొన్నారు. ఈ పాడ్‌కాస్ట్ గత సంవత్సరం మొదటి భాగంగా విడుదల కాగా, మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో రెండో భాగాన్ని ఇటీవలే విడుదల చేశారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలో పలు ఆసక్తికర విషయాలు చర్చకు వచ్చాయి.భారత్‌లో ఉన్నన్ని రోజులు ఎందుకు బిజీబిజీగా కనిపిస్తారని నిఖిల్ అడిగిన ప్రశ్నకు బిల్ గేట్స్ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. అలా ఉండటం తనకు సరదా అని వ్యాఖ్యానిస్తూ కఠినంగా ఉంటూ పని చేయాలి అనుకుంటూ మోసం చేసుకోకూడదన్నారు.పెట్టుబడుల కోణంలో అధిక జనాభా మంచిదా కాదా అని నిఖిల్ అడిగిన ప్రశ్నకు గేట్స్ షాకింగ్ సమాధానం ఇచ్చారు. దాదాపు రెండేళ్లలో ఏఐ అన్నింటినీ మార్చేస్తుందని, ప్రజలు తొందరగా పదవీ విరమణ చేసేయొచ్చని అన్నారు. పని వారాలు కూడా తగ్గిపోతాయని పేర్కొన్నారు. ప్రజలు తమ సమయాన్ని ఎలా గడపాలి అనే దానిపై ఆలోచనలు చేయాల్సి ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా తనకు పని లేకపోయినా తాను దాన్ని కల్పించుకుంటున్నానని తెలిపారు. ఏఐతో వచ్చే మార్పుల కోసం ప్రస్తుతం ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారన్నారు. ఈ పాడ్‌కాస్ట్‌లో గేట్స్ సోషల్ సర్వీస్ పైనా చర్చించుకున్నారు.

Advertisements

అత్యంత ప్రాధాన్యమైనవి

బిల్ గేట్స్ తన పిల్లల గురించి మాట్లాడుతూ, “వారికి అద్భుతమైన విద్య, మంచి పెంపకం లభించినప్పటికీ, వారికి అపార సంపద అందించడం నాకు నచ్చదని స్పష్టంగా చెప్పాను,” అని చెప్పారు. “ఇక్కడ నా లక్ష్యం రాజ్యవంశాన్ని నిర్మించడం కాదు. నేను వారిని మైక్రోసాఫ్ట్‌ను ఉపయోగించమని కోరడం లేదు. వారు స్వయంగా విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను,” అని ఆయన వివరించారు.గేట్స్ ఇంకా పేర్కొంటూ, తన పిల్లల పట్ల ప్రేమ, మద్దతు ఇప్పటికీ తనకు అత్యంత ప్రాధాన్యమైనవి కావడంతో పాటు, తన సంపదలో ఎక్కువ భాగాన్ని అవసరమైన వారికి సహాయం చేయడానికి వినియోగించాలనేది తన అభిప్రాయమని అన్నారు.వారు తమకు అందుతున్న ప్రేమ, మద్దతును తెలుసుకున్నారు. కానీ ఈ సంపదకు సరైన వారసులు మా ఫౌండేషన్ అని వారు బాగా తెలుసుకున్నారు,” అని గేట్స్ స్పష్టం చేశారు.

  Bill Gates:రెండేళ్లలో ఏఐ అన్నింటినీ మార్చేస్తుంది: బిల్ గేట్స్

సమాజానికి తిరిగి

పాడ్‌కాస్ట్ ఎపిసోడ్ లో ,గేట్స్ గ్లోబల్ స్థాయిలో చేస్తున్న సేవా కార్యక్రమాలను, అలాగే తన నిర్ణయాలకు దారితీసిన సూత్రాలను చర్చిస్తూ, ప్రపంచంలోని అత్యంత ప్రభావశీల వ్యక్తులలో ఒకరైన బిల్ గేట్స్ వ్యక్తిత్వాన్ని మరింత దగ్గరగా చూపించింది. ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు చేస్తున్న కృషిని వివరించడమే కాక, వ్యక్తిగత విలువలు, కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత,ధనాన్ని సామాజిక సంక్షేమానికి ఎలా మలచాలన్న దానిపై ఆయన దృష్టికోణాన్ని ఈ సంభాషణ ద్వారా తెలుసుకునే అవకాశం లభించింది.ఈ సంభాషణ ఎంతో ప్రేరణాత్మకంగా ఉంది. సంపదను తక్కువ చేయడం లేదని, కానీ దాన్ని సమాజానికి తిరిగి ఇవ్వడం ద్వారా నిజమైన విలువను సృష్టించవచ్చని గేట్స్ చెప్పారు. తన పిల్లల విజయాన్ని ప్రోత్సహించడం ద్వారా వారిని స్వతంత్రంగా నిలబెట్టవచ్చని స్పష్టం చేశారు.

Read Also: Donald Trump : టారిఫ్ వార్ కు తెరలేపిన ట్రంప్

Related Posts
ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం ఇంట్లో ఈడీ సోదాలు
ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం ఇంట్లో ఈడీ సోదాలు

ఛత్తీస్‌గఢ్ లిక్కర్ స్కామ్: భూపేష్ భఘేల్ పై ఈడీ దాడులు భూపేష్ భఘేల్, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం తీవ్ర Read more

మీటింగ్‌కు హాజరుకాలేదు అనే కారణంతో 99 ఉద్యోగులను తొలగించిన CEO..
fired

ఒక US-based CEO, 99 ఉద్యోగులను ఒక్కసారిగా ఉద్యోగం నుండి తొలగించి, ఆన్‌లైన్‌లో పెద్ద చర్చలకు కారణమయ్యారు. ఈ CEO, తన సంస్థలో జరిగిన ఒక ముఖ్యమైన Read more

Donald Trump: బైడెన్ పాలనలో పెరిగిన వాణిజ్య లోటు: ట్రంప్
: బైడెన్ పాలనలో పెరిగిన వాణిజ్య లోటు: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూఎస్ ఆర్థిక విధానంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సుంకాల విషయంలో తగ్గేదేలే అన్నట్లు చెప్పకనే చెప్పారు. అనేక దేశాలు తమ Read more

భారత్ పోల్ తో వేగంగా దర్యాప్తు :అమిత్ షా
amith shah

ఇటీవల కాలంలో నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతున్నది. వీరిని ఇండియాకు తీసుకుని రావడం కష్టతరంగా అవుతున్నది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×