గుజరాత్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం అందరినీ శోకసంద్రంలోకి నెట్టింది. ఇప్పుడు ఈ ప్రమాదానికి సంబంధించిన మరో దిగ్భ్రాంతికర వీడియో వెలుగులోకి వచ్చింది. విమానం కూలిన బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంలోని విద్యార్థులు ప్రాణాల కోసం బాల్కనీ (balcony) ల నుంచి కిందికి దూకుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరినీ తీవ్రంగా కలచివేస్తోంది.
ప్రమాద సమయంలో హాస్టల్లో భయంకర పరిస్థితి
జూన్ 12వ తేదీ మధ్యాహ్నం సమయంలో అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి లండన్కి బయలుదేరిన ఎయిరిండియా విమానం, టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే తక్షణమే ట్రాక్షన్ను కోల్పోయింది. నియంత్రణ కోల్పోయిన విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ (BJ Medical College Hostel) భవనంపై కుప్పకూలింది. హాస్టల్లో వందల సంఖ్యలో విద్యార్థులు ఉండగా, ఈ ప్రమాదం ఒక్కసారిగా వారిని గంభీర భయాందోళనకు గురిచేసింది. విమానం భవనాన్ని ఢీకొట్టిన సమయంలో పెద్ద శబ్దం వచ్చిందని, విద్యార్థులు చెప్పారు.తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో, భవనంలో మంటలు వ్యాపిస్తుండగా, కొందరు విద్యార్థులు రెండు, మూడు అంతస్తుల్లోని బాల్కనీల నుంచి బెడ్షీట్లు, తాళ్ల సహాయంతో కిందికి దిగుతూ, మరికొందరు నేరుగా దూకుతూ కనిపించారు.

కాపాడుకునేందుకు
భవనానికి ఒకవైపు మంటలు ఎగిసిపడుతుండగా, మరోవైపు నుంచి విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలు హృదయాలను కలిచివేస్తున్నాయి.ఈ దుర్ఘటన జరిగిన సమయంలో హాస్టల్లోని చాలా మంది విద్యార్థులు (students) భోజనం చేస్తున్నారు. విమానం భవనంపై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 241 మంది అక్కడికక్కడే మరణించారు. వీరితో పాటు, విమానం కూలిన హాస్టల్ భవనంలోని పలువురు వైద్య విద్యార్థులు, సిబ్బందితో కలిపి మరో 33 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు.
Read Also: Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి హైకోర్టులో దొరకని ఊరట