అపార్ కార్డ్‌తో తల్లిదండ్రులకు కొత్త కష్టాలు

అపార్ కార్డ్‌తో తల్లిదండ్రులకు కొత్త కష్టాలు

దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేటు విద్యాసంస్థల్లో కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులకు ఇకపై ఆధార్‌ తరహాలో అపార్‌ (Automated Permanent Academic Account Registry – APAAR) గుర్తింపు కార్డు అందుబాటులోకి రానుంది. ‘వన్‌ నేషన్‌- వన్‌ ఐడీ’ పేరుతో 17 అంకెలుండే ఈ కార్డులు ఇచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. కొన్ని రాష్ట్రాల్లోని విద్యార్థులకు ఇప్పటికే ప్రయోగాత్మకంగా అందించారు.
పాఠ‌శాల‌ల విద్యార్థుల‌కు తప్పనిసరి
దేశంలోని అన్ని ప్ర‌భుత్వ, ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల విద్యార్థుల‌కు ఈ కార్డు జారీ చేయ‌నున్నారు. అపార్ కార్డు పేరుతో దీన్ని తీసుకురానున్నారు. అపార్‌కార్డ్ అంటే ఆటోమేటెడ్‌ పర్మినెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ . కేంద్ర‌ప్ర‌భుత్వం అపార్ కార్డ్ పేరుతో వన్‌ నేషన్-వన్‌ ఐడీ’ కార్డును అందుబాటులోకి తీసుకురానుంది. విద్యార్థులకు ఈ గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియను త్వ‌రిత‌గ‌తిన ప్రారంభించాలని అన్ని రాష్ట్రాలు, యూటీలను కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. కానీ ఈ తరహాలో తల్లిదండ్రులకు కొన్నిఇబ్బందులకు గురవుతున్నారు. పేరెంట్స్ తమ పేర్లను, చిరునామాలు అక్షర దోషాలు లేకుండా సమర్పించాలి. దీనితో వారు మీ సేవ చుట్టు తిరుగుతున్నారు. గంటలకొద్దీ వీటికోసం వేచి వుండాలి. జాబ్ చేసే తల్లులకు ఈ ప్రాసెస్ కోసం సెలవులకు తీసుకునేందుకు ఇబ్బందిగా వుంటున్నది.

విద్యార్థి కుటుంబ వివరాలు

విద్యార్థి కుటుంబ వివరాలు

ఈ ఆపార్ కార్డ్ బాధ్య‌త‌ను నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరంకు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఏఐసీటీఈ మాజీ ఛైర్మన్ ఆచార్య సహస్రబుద్దే దీనికి ఛైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించనున్నారు. ఆధార్‌తో అనుసంధానం చేసిన ఈ ప్రత్యేక సంఖ్యను నమోదుచేస్తే చాలు.. విద్యార్థి కుటుంబ వివరాలు, మార్కుల సర్టిఫికేట్లు తదితర వివరాలన్నీతెలుసుకోవ‌చ్చు. ప్రవేశ పరీక్షల దరఖాస్తుల్లోనూ ఈ సంఖ్యను నమోదుచేస్తే సరిపోతుంది.

17 అంకెలున్న నంబర్‌
ఈ కార్డుతో దేశంలో కేజీ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థుల సమగ్ర వివరాలు ఒకే ద‌గ్గ‌ర పొందుప‌రిచేలా చేస్తోంది కేంద్రం. విద్యార్థి ఎల్‌కేజీలో చేరినప్పటి నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు.. అన్ని వివ‌రాలు ఇందులో ఉండనున్నాయి. పూర్తివివరాలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వీలుగా ఈ కార్డు ఉపయోగ‌ప‌డేలా చేయ‌నుంది కేంద్ర ప్ర‌భుత్వం. ఈ కొత్త కార్డును ఆధార్ సంఖ్యతోపాటు ‘అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ (ఏబీసీ)’ అనే ఎడ్యులాకర్‌కు అనుసంధానించ‌డం జ‌రుగుతుంది. ఈ అపార్‌ నెంబర్‌నే విద్యార్థి జీవితకాల ఐడీగా ప‌రిగ‌ణించ‌నున్నారు.

Related Posts
2040 నాటికి చంద్రుడిపైకి వ్యోమగామిని : జితేంద్ర సింగ్‌
భారత అంతరిక్ష లక్ష్యం: 2040లో మనిషిని చంద్రుడిపైకి పంపే యోచన

భారతదేశం అంతరిక్ష పరిశోధనలో గణనీయమైన పురోగతి సాధిస్తోంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకారం, భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 44 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా Read more

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు
budget meeting of the Parliament has been finalized

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జనవరి 31వ తేదీన మొదలై ఫిబ్రవరి 13వ తేదీ వరకు తొలి విడత బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. రెండవ Read more

Pralhad Joshi: :కర్ణాటక రాజకీయాలపై ప్రహ్లాద్ జోషి ఆగ్రహం
కర్ణాటక రాజకీయాలపై ప్రహ్లాద్ జోషి ఆగ్రహం

కర్ణాటక రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో వక్ఫ్ (సవరణ) బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. దీనిపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్రంగా Read more

కుంభమేళా పొడిగింపుపై ప్రభుత్వం క్లారిటీ
కుంభమేళా పొడిగింపుపై ప్రభుత్వం క్లారిటీ

మహాకుంభమేళా కొత్త రికార్డులను నెలకొల్పుతోంది. అంచనాలకు మించి భక్త జనం కుంభమేళాకు తరలి వస్తోంది. 40 కోట్ల మంది భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేసారు. ఇప్పటికే Read more