
KTR: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీల అమలు తీరుపై ప్రభుత్వాన్ని నిలదీశారు.
Read Also: Indiramma House updates: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం
తొలి సంతకం ఫైల్ మాయమైందా?
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తూ చేసిన తొలి సంతకం ఫైల్ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. తొలి కేబినెట్లోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు, మరి ఆ ఫైల్ ఎక్కడుంది? అది ఎఫ్ఎస్ఎల్ (FSL) అగ్నిప్రమాదంలో కాలిపోయిందా? అని అసెంబ్లీ సాక్షిగా నిలదీశారు. గవర్నర్ ప్రసంగంలో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించామని చెప్పడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
మాయమైన ఆరు గ్యారంటీల ఫైలును వెతికి పట్టుకోవడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) వేయాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కి, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేదని.. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందని కేటీఆర్ తన ప్రసంగంలో ధ్వజమెత్తారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: